త్వరలో గో బ్యాక్ రోహింగ్యా ఉద్యమం
(హైదరాబాద్, న్యూస్ఇన్)
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసగా తెలంగాణా శివసేన ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన చేశారు. పార్టీ రా|ష్ట అధ్యక్షులు శివాజీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బంగ్లాదేశ్ జాతీయ జెండాను దగ్దం చేశారు. ఈ సందర్భంగా శివసేన నేత కీలక వ్యాఖ్యలు చేశారు. IPL లో పాకిస్థాన్ దేశం పైన విధించిన ఆంక్షలు బాంగ్లాదేశ్ పైనా విధించాలని డిఆమడ్ చేశారు. IPL లో బాంగ్లాదేశ్ ఆటగాళ్లు ఉంటే అడ్డుకుంటామని, అవసరమైతే దాడులు చేసేందుకు కూడా వెనుకడుగు వేయమని ప్రకటించారు.

హిందువుల ఆత్మ గౌరవం కంటే ఏది ఎక్కువ కాదని BCCI గుర్తించాలన్నారు.బాంగ్లాదేశ్ లో హిందువులను అతి కిరాతకంగా చంపుతుంటే ఇక్కడ వాళ్లకు కోట్ల రూపాయలు ఇచ్చి ఆడించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పాకిస్తాన్ తో మాదిరిగానే బంగ్లా జట్టును కూడా BCCI దూరం పెట్టాలని డిమాండ్ చేశారు. భారత్ దేశంలో CAA పూర్తి స్థాయిలో వెంటనే అమలు చెయ్యాలి…ఇస్లామిక్ దేశాలలో చిన్న సంఘఠన జరిగితే రోడ్ల పైకి వచ్చే మేధావులు ఇప్పుడు సైలెంట్ గా ఉండడం వెనుక అర్ధం ఏమిటని ప్రశ్నించారు. అక్రమంగా దేశంలోకి వచ్చి హైదరాబాద్ లో అన్ని సౌకర్యాలు పొందుతున్న రోహింగ్యాలపై త్వరలో గో బ్యాక్ రోహింగ్యా ఉద్యమాన్ని మొదలు పెట్టనున్నట్లు వెల్లడించారు.


Leave a Reply