NewsInn

News in a Click

బీజెపి ఆధ్వ‌ర్యంలో “వీర్ బాల్ దివ‌స్”

బీజెపి ఆధ్వ‌ర్యంలో “వీర్ బాల్ దివ‌స్”

త్యాగాల‌కు చిహ్నం ఆ సోదరులు

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌)

గురు గోవింద్ సింగ్ జీ చిన్న కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ ల త్యాగాలను స్మరిస్తూ వీరబాల్ దివస్ కార్యక్రమాన్ని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని వీరబాలల స్మృతికి నివాళులర్పిస్తూ, వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. దేశం, ధర్మం, సంస్కృతి కోసం ప్రాణత్యాగం చేసిన వీర బాలుల స్ఫూర్తి రాబోయే తరాలకు మార్గదర్శకమని నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంతో వీరబాల్ దివస్‌ను దేశవ్యాప్తంగా జరుపుకోవడం సిక్కు మ‌తం త్యాగాలకు దక్కిన గౌరవమన్నారు.

డిసెంబర్ 26వ తేదీని, 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వీర బాల్ దివస్’గా దేశవ్యాప్తంగా జరపాలని నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్పారు.ఈ రోజు వెనుక ఉన్న చరిత్ర, త్యాగం ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.వీర బాల్ దివస్ అనేది సిక్కుల దశమ గురువు గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారుల్లో చిన్నవారైన బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌ల త్యాగానికి గుర్తుగా జరుపుకుంటున్న రోజు అని చెప్పారు. అప్పటికి వారి వయసు కేవలం ఏడు సంవత్సరాలు, తొమ్మిది సంవత్సరాలు మాత్రమే. ఆ రోజుల్లో మొఘల్ పాలకులు బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నించిన సమయంలో, ఈ చిన్నారులు “మేము మా ధర్మాన్ని వదలము, మా విశ్వాసాన్ని త్యజించము” అంటూ మొఘల్ సామ్రాజ్యానికి ఎదురు నిలబడి ప్రాణ త్యాగానికి వెనుక‌డుగు వేయ‌లేద‌న్నారు. ఆనాటి కాలంలో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా సిక్కులు ధైర్యంగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు. దేశం కోసం, ధర్మం కోసం, మన సంస్కృతి కోసం ప్రాణత్యాగాలు చేసిన వీర బాలకులు – గురు గోబింద్ సింగ్ జీ కుమారులు మనందరికీ స్ఫూర్తి. రాబోయే తరాలకు ఆదర్శం. అందుకే ఈరోజు మనం వీర బాల్ దివస్ ను ఘనంగా జరుపుకుంటున్నామ‌న్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *