(న్యూస్ఇన్, అమరావతి)
ఆరవ తరగతి నుంచే వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్ నినాదంతో విద్యార్థులకు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. విద్యార్థులను చిన్న వయసు నుంచే పారిశ్రామిక ఆలోచనల వైపు తీసుకెళ్లేందుకు కొత్త కార్యాచరణ చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ పాలనలో వేగంతో పాటు ప్రతి నిర్ణయంలో మానవీయ కోణం ఉండాలని సీఎం సూచించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూనే ప్రజలకు అనుకూలంగా పోలీసులు పనిచేయాలన్నారు. వీఐపీలు, వీవీఐపీల పర్యటనల సమయంలో అనవసర హడావుడి చేయొద్దని, ముఖ్యమంత్రి వస్తున్నారని 15 నిమిషాల ముందే ట్రాఫిక్ నిలిపివేయడం ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి ఉద్యోగి చేసిన తప్పు ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని గుర్తుంచుకోవాలన్నారు.

రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై మాట్లాడుతూ పరిశ్రమలు, సేవలు, వ్యవసాయ రంగాల వృద్ధితో జీఎస్డీపీ పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జీఎస్టీలో 18 శాతం వృద్ధి నమోదైందన్నారు. 2027 నాటికి భూసమస్యల పరిష్కారం, 5.32 లక్షల ఇళ్ల నిర్మాణం, 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందించడం తమ ప్రభుత్వ లక్ష్యంగా అధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు.
ఏఐ నైపుణ్యాలను పెంచడం, డేటా లేక్ ద్వారా ప్రభుత్వ శాఖల సమన్వయం, సైబర్ నేరాల నియంత్రణపై కూడా సీఎం పలు సూచనలు చేశారు.












Leave a Reply