(న్యూస్ఇన్,హైదరాబాద్)
రాష్ట్రంలో కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వం భూముల చోరీకి పాల్పడుతుందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు. భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల చోరీపై రాహుల్ గాంధీకి పూర్తి వివరాలు వివరించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. శాసనసభ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. భూ అక్రమాలు బయటపడతాయనే భయంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు.
తమ ప్రభుత్వ హయాంలో సుమారు 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండేవని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య కోటి 16 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. తన నియోజకవర్గంలో సముద్రలింగాపురంలో 800 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని వెల్లడించారు.
మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, నగరంలోని పారిశ్రామిక భూముల విషయంలోనూ ప్రభుత్వం తీరుపై కేటీఆర్ మండి పడ్డారు. ల్డర్లను బెదిరించి కమిషన్లు వసూలు చేయడం మామూలు విషయంగా మారిందని కేటిఆర్ ఆరోపించారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను కాపాడుకోవాల్సిన బాధ్కత మనపై ఉందన్నారు. రాబోయే రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.












Leave a Reply