(న్యూస్ఇన్, హైదరాబాద్)
గత ప్రభుత్వం నుంచి తాజా భూ వివాదాలపై వరకు హాయంలో జరిగిన అవకతవకలపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై హరీష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సమస్యలను తప్పుదోవ పట్టించేందుకు సీఎం డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారని ఆరోపించారు.
22A నిషేధిత భూముల అంశంపై బీఆర్ఎస్ గతంలో చేసిన ఆరోపణలు నిజమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అంగీకరించారని హరీశ్ రావు పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో భూముల చేర్పు, తొలగింపుపై ప్రభుత్వం వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు ఎన్ని భూములను నిషేధిత జాబితాలో చేర్చారు, ఎన్ని తొలగించారనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధరణి, భూ భారతి వ్యవస్థల్లో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

అందుకే సస్పెండ్ చేశారు…
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్పైనా హరీశ్ రావు స్పందించారు. ప్రజా సమస్యలు, ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆరోపించారు. టీషర్టుల వ్యవహారం పేరుతో సభ నుంచి బయటకు పంపించారని, తమ మహిళా ఎమ్మెల్యేల విషయంలో జరిగిన పరిణామాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సీఎం చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. తనతో పాటు బీఆర్ఎస్ నేతల ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లు, ఆదాయపు పన్ను రిటర్నుల్లో వెల్లడించామని తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై వచ్చిన ఆరోపణలపైనా స్పష్టత ఇవ్వాలన్నారు.












Leave a Reply