(న్యూస్ఇన్,హైదరాబాద్)
ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం కు దరఖాస్తుల స్వీకరణ గడువును 2026 సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల మంది అర్హులైన బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 2026 సెప్టెంబర్ 30వ తేదీలోగా TGOBMMS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.













Leave a Reply