వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోండి
ఏపీలో ప్రధాన పార్టీలన్నీ కలిసి పోరాడాలి
(అమరావతి,న్యూస్ఇన్)
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవాలంటే ప్రధానమంత్రిగా రాహూల్ గాంధీకి అవకాశం వచ్చినప్పుడే అది సాధ్యం అవుతుందని తెలంగాణా కాంగ్రెస్ కీలక నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో రాహూల్ ప్రధాని అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఏపీ ప్రజలకు రక్షించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి 20 మంది ఎంపి లను గెలిపించండి… రూ.2.50 లక్షల కోట్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ దక్కుతుందన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి పలు అంశాలపై స్పందించారు. విశాఖ ఉక్కు… ఆంధ్రుల హక్కు అనే నినాదానిది ఒక చరిత్ర అని…..విశాఖ స్టీల్ ఆంధ్రుల హక్కు.. దానిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ఉద్యమం వల్లే వెంకయ్య నాయుడు జాతీయ స్థాయి నేత గా ఎదిగారని చెప్పారు.

14 వేల కోట్ల తో ఇందిరా గాంధీ ప్రారంభించిన విశాఖ ఉక్కు కర్మాగారం ఇప్పుడు రూ.2.50 లక్షల కోట్ల సంపద గా మారిందన్నారు.విలువైన విశాఖ ఉక్కు పై మోడీ కన్నుపడిందని, దురుద్దేశ్యంతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటం లో మాజీ సీఎం జగన్, ప్రస్తుత సీఎం చంద్ర బాబులు ఇద్దరూ విఫలమయ్యారని చెప్పారు. ప్రధాని మోడీ కి సన్నిహితంగా ఉండే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ కు వెళ్లి కార్మికులను కలిశారు.. కానీ ఫలితం లేదన్నారు.ఏపి లో ఇంతమంది నాయకులు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ ను కాపాడలేరా ? అని ప్రశ్నించారు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పార్టీల ఎంపి లు ఉక్కు కర్మాగారం కోసం కలిసి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసి కాపాడుకోవాలని సూచించారు. పార్టీ నష్టపోతుందని తెలిసినా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీ చేసిందని, …..ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ను కాపాడి మాటను తమ పార్టీ నిలబెట్టుకుంటుందని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏపి నుండి 20 మంది ఎంపి లను గెలిపించాలని కోరారు. విభజన సమయం లో నేను ఒక్కడినే విభజన చేయకండి అని చెప్పాను, అందుకే ఏపి లో మాట్లాడేందుకు నాకు పూర్తి హక్కులు ఉన్నాయని చెప్పారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే చేసే నాకు ఏపి అభివృద్ధి కుడా ముఖ్యం మన్నారు. కేసీఆర్ జగన్ ఇంటికి వచ్చి చేపలు తిన్నాడుని, జగన్ కేసీఆర్ ఇంటికి వచ్చి కోడి కూర తిన్నాడని సీఎం రేవంత్ రెడ్డి అంత దిగజారి వ్యవహరించే పరిస్థితి లేదన్నారు.


Leave a Reply