NewsInn

News in a Click

ఏడాది త‌రువాత పుష్పా-2 పై చార్జ్ షీట్

ఏడాది త‌రువాత పుష్పా-2 పై చార్జ్ షీట్

మ‌హిళ మృతి- బాలుడికి తీవ్ర గాయాలు

ప్ర‌భుత్వం దూకుడు పోలీసులు స్లో

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

తెలుగు సినిమా రంగంలోకి క‌ల‌కం రేపిన పుష్ఫా 2 విడుద‌ల సంద‌ర్బంగా జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌కు బాద్యుడిగా ప్ర‌భుత్వం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేసింది. తొక్కిస లాట‌లో ఓ మ‌హిళ మృతి చెంద‌డంతో ఆమె త‌న‌యుడు తీవ్రంగా గాయ‌ప‌డి ఇంకా కోలుకోలేదు.ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వం దూకుడుగా వ్య‌వ‌హ‌రించినా…పోలీసులు మాత్రం త‌మ స‌హ‌జ ధోర‌ణిలో ఏడాది త‌రువాత చార్జ్ షీట్ దాఖ‌లు చేయ‌డంతో మారోసారి చ‌ర్చ‌నీయంశంగా మారింది.

ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌తో బాలుడికి వైద్య స‌హాయం అందించేందుకు అల్లు అర‌వింద్ ఆర్ధిక స‌హాయం అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న అటు సినీరంగంలో ఇటు రాజ‌కీయ‌రంగంలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. అల్లు అర్జ‌న్ అరెస్టు వ్య‌వ‌హారం దూమారం రేపింది. ఈకేసులో పోలీసులు తాజాగా చార్జ్ షీట్ దాఖ‌లు చేశారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు బాధ్యులుగా చేస్తూ 23 మంది పేర్ల‌ను చార్జ్ షీట్లో చేర్చారు. ఏ1 గా సంధ్యా థియేట‌ర్ యాజ‌మ‌న్యాన్ని పోలీసులు చేర్చారు. 23 మంది నిందితుల జాబితాలో అల్లు అర్జ‌న్ పేరు ఏ11 గా పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురు మేనేజ‌ర్లు,8 మంది బౌన్స‌ర్ల పేరుకూడా చార్జ్ షీట్ లో పోలీసులు న‌మోదు చేశారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ నెల‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై ఏడాది త‌రువాత పోలీసులుచార్జ్ షీట్ దాఖ‌లు చేయ‌డం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *