(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రముఖ యూ ట్యూబర్ అన్వేష్ హిందూ దేవుళ్ళపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ తగ్గించడంతోపాటు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. విదేశాల్లో ఉంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దూషించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సినీనటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు.

కళ్యాణి ఫిర్యాదు పై 352,79,299 BNS SEC 67IT ACT ప్రకారం అన్వేష్ పై కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగాపంజాగుట్ట పోలీసులు త్వరలో అన్వేష్ కి నోటీసులు జారీ చేయమన్నారు. అయితే
అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో వరస పిర్యాదులు పోలీసులకు అందుతున్నాయి. ఈ యూట్యూబర్ ను భారత దేశానికి రప్పించి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు జోరుగా వినిపిస్తున్నాయి.






Leave a Reply