(హైదరాబాద్,న్యూస్ఇన్)

దుర్గం చెరువును ఆక్రమిస్తూ అక్రమ పార్కింగ్ దంధా నిర్వహిస్తున్నారని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై మాధాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. చెరువులో 5 ఎకరాల భూమిని మట్టి, రాళ్లతో నింపి అక్రమంగా పార్కింగ్ దంధా చేస్తున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ స్థంలో ప్రైవేటు ఆపరేటర్లకు అద్దెకు ఇస్తూ ఎమ్మెల్యే 2014 నుంచి నెలకు 5 లక్షల రుపాయల అద్దెలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులో హైడ్రా అధికారులు పేర్కొన్నారు. వెంకట్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి ఎమ్మెల్యే అక్రమ దంధాకు తెరలేపారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో హైడ్రా ఈ విషయాన్ని ప్రస్తావించింది.
ప్రభుత్వ భూమి లేదు…కక్షతోనే కేసు
అయితే తనపై నమోదైన కేసు ప్రభుత్వం కక్షతో నమోదు చేసిందని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వభూమి అక్కడ లేదన్నారు. గతంలో కోర్టు వేసిన వేలంలో రెండెకరాల భూమి తాము కొనుగోలు చేశామని, ఆ తరువాత ఆ తుది తీర్పుతో అది చెల్లదని ఇవ్వడంతో దుర్గం చెరువు పూర్తి నిర్మాణం జరిగిందన్నారు. ఆ ప్రాంతంలో బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరి బాబు భూములు ఉన్నాయన్నరు. ప్రభుత్వ భూమి అక్కడ లేనే లేదని స్పష్టం చేశారు. తనపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాల దగ్గర తాను ఆందోళన చేస్తానని హెచ్చరించారు.





Leave a Reply