72 గంటల్లో ఏటిఆర్ ఇవ్వాలని ఆదేశం
(హైదరాబాద్,న్యూస్ఇన్)
అంతర్జాతీయ గుర్తింపు ఉన్న గ్రూక్( ట్విట్టర్) ఆపరేషన్లు దేశంలో వివాదాస్పదంగా మారాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో అశ్లీల దృష్యాలు, న్యూడ్ ఫోటోలు కనిపిస్తుండడంతో దీన్ని ఆసరగా చేసుకుని గ్రూక్ చాట్ బాట్ ద్వారా సోషల్ మీడియాలో అకతాయిలు ప్రైవేటు వ్యక్తుల ఫోటోలతో కొత్తగా కంటెంట్ జనరేట్ చేస్తున్నారు. ఏఐ అసరాగా చేసుకుని కొత్త కంటెంట్ సృష్టిస్తున్నారు. ఇది వైరల్ మారుతుండడంతో అమాయక మహిళలు, చిన్నారులు అన్యాయంగా బలవుతున్నారని ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందిచిన కేంద్రం గ్రోక్ చాట్ బాట్ సృష్టిస్తున్న అసభ్యకరమైన కంటెంట్ వెంటనే తొలగించాలని, 72 గంటల్లో తీసుకున్న చర్యల గురించి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.






Leave a Reply