
హైదరాబాద్ నగరానికి కృష్ణా ఫేజ్-1, 2 & 3 ద్వారా అందిస్తున్న మంచినీటి సరఫరాపై ఆరు గంటలపాటు అంతరాయం ఏర్పడనుంది.నాసర్లపల్లి జలమండలి పంపింగ్ స్టేషన్ల వద్ద ఉన్న 132 కేవీ సబ్స్టేషన్లలో బల్క్ ఫీడర్ల నిర్వహణా పనులు, అదేవిధంగా దెబ్బతిన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు (CTs) మార్పిడి పనుల కోసం టీజీ ట్రాన్స్కో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనుంది. విద్యుత్ నిలిపివేత కారణంగా కృష్ణా ఫేజ్-1, 2 & 3లకు అనుబంధంగా ఉన్న డివిజన్ పరిధుల్లో నీటి సరఫరాలో అంతరాయం తప్పనిసరి కానుంది. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు ఒక ప్రకటనలో కోరారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు…
ఓ అండ్ ఏం డివిజన్ నం-1, చార్మినార్
డివిజన్ నం-2, వినయ్ నగర్
డివిజన్ నం-3, బోజగుట్ట
డివిజన్ నం-4, రెడ్ హిల్స్
డివిజన్ నం-5, నారాయణ గూడ
డివిజన్ నం-6, ఎస్ ఆర్ నగర్
డివిజన్ నం-7, మారేడ్ పల్లి
డివిజన్ నం-8, రియాసత్ నగర్
డివిజన్ నం-9, కూకట్ పల్లి
డివిజన్ నం-10, సాహెబ్ నగర్
డివిజన్ నం-11, హయత్ నగర్
డివిజన్ నం-13, సైనిక్ పురి
1డివిజన్ నం-14, ఉప్పల్
డివిజన్ నం-15, హఫీజ్ పేట్
డివిజన్ నం-16,రాజేంద్ర నగర్
డివిజన్ నం-18, మణికొండ
డివిజన్ నం-19, బోడుప్పల్
డివిజన్ నం-20, మీర్ పేట్ డివిజన్ ప్రాంతాలు





Leave a Reply