NewsInn

News in a Click

దొంగలకు దొంగ ఆ పోలీస్

దొంగలకు దొంగ ఆ పోలీస్

హైదరాబాద్, న్యూస్ ఇన్

కంచె చేను మైసిందనేది పాత సామెత…. పోలీసులే దొంగలవుతున్నారన్నది కొత్త విధానం…. పోలీస్ స్టేషన్లో ఉంచిన విలువైన వస్తువులను పోలీసులే తస్కరిస్తూ పట్టుబడుతున్నారు. ఓ ఎస్ ఐ పోలీస్ స్టేషన్లోని ఐదు తులాల బంగారం చోరీ చేసి దొరికిపోగా….. తాజాగా ఓ కానిస్టేబుల్ దాదాపు రెండు లక్షల విలువ చేసే ఫోన్ చోరీ చేసి పట్టుబడ్డారు. పోలీసులే దొంగల అవతారం ఎత్తితే పరిస్థితులు ఏమిటన్నది ఆలోచించుకోవాల్సిన విషయమే. మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో
ఓ విలువైన సెల్ ఫోన్ పోయిందని పోలీసులకు కొన్ని రోజుల క్రితం ఓ ఫిర్యాదు అందింది. దీంతో సీసీటీవీలు పరిశీలించి ఆ దొంగను పట్టుకుని విలువైన సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కన్నేసిన ఓ దొంగ పోలీస్ రికవరీ చేసిన రూ.1.75 లక్షల ఫోను చోరీ చేశారు. పోలీస్ స్టేషన్ లోని లాకర్లో పెట్టిన విలువైన ఆ ఫోన్ ను పోలీస్ శాఖలో డ్రైవర్ గా
శ్రవణ్ కుమార్ కొట్టేసారు. శ్రవణ్ కుమార్ దొంగతనం చేసాడని నిర్ధారించి, అతన్ని పోలీసులు రిమాండుకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *