NewsInn

News in a Click

క‌డియం శ్రీహ‌రి పై మంత్రి సురేఖ ఆగ్ర‌హం – ఫిర్యాదు

క‌డియం శ్రీహ‌రి పై మంత్రి సురేఖ ఆగ్ర‌హం – ఫిర్యాదు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

స్టేష‌న్ ఘ‌న్పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రిపై మంత్రి సురేఖ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌కు స‌మాచారం లేకుండానే దేవాదాయ శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించడంపై సీరియ‌స్ అయ్యారు. మంత్రిగా తాను ఉన్నా…..అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. క‌డియం తీరుపై ముఖ్య‌మంత్రి కి ఫిర్యాదు చేశారు. మూడు పేజీల లేఖ‌లో ప‌లు అంశాల‌ను కొండా సురేఖ ప్ర‌స్తావించారు.

క‌డియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలు, మంత్రిగా తన అధికార పరిధిని బేఖాతరు చేశారని మంత్రి సురేఖ లేఖలో పేర్కొన్నారు.

మంత్రి కొండా సురేఖ తన ఫిర్యాదు లేఖలో, దేవాదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించిన పరిపాలన, విధాన నిర్ణయాలు, అధికారిక సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ తదితర అంశాలు సంబంధిత శాఖా మంత్రి పరిధిలోకి వస్తాయి.

దేవాలయ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు, అధికారులకు గడువులు నిర్దేశించడం వంటి అంశాలపై అధికారిక సమీక్ష నిర్వహించడం పరిపాలనా పరంగా అభ్యంతరకరమని, RULES OF BUSINESS స్ఫూర్తిని ఉల్లంఘించడమే.

ఇలాంటి చర్యలు ప్రభుత్వంలో పరిపాలనా సమన్వయాన్ని దెబ్బతీయడమే కాకుండా అధికార యంత్రాంగంలో అయోమయ పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది.

భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి

ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అంశాలపై వివరణ కోరడంతో పాటు, పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తన ఫిర్యాదులో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *