NewsInn

News in a Click

రికవరీ బంగారాన్ని మాయం చేసిన ఎస్ఐ

సర్వీస్ తుపాకీ మిస్సింగ్ -ఎస్ఐ అరెస్ట్తు

తుపాకీ అమ్ముకున్నారని ఆరోపణలు

( హైదరాబాద్,న్యూస్ ఇన్ )

నేరస్తులనుంచి నుంచి రికవరీ చేసిన బంగారం పోలీస్ స్టేషన్ నుంచే మాయం అయింది. సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న భాను ప్రకాష్ ఎందుకు కారణంగా పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించారు.హైదరాబాద్ లోని అంబర్‌పేట్‌ పోలీస్ స్టేషన్లో దొంగల నుండి రికవరీ చేసిన బంగారంతో పాటు, సర్వీస్ తుపాకీ కనిపించకుండా పోయాయి.

ఈ విషయాన్ని గుర్తించిన పోలీసు అధికారులు ఎస్ఐ భాను ప్రకాష్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.బెట్టింగ్ వ్యసనం ఉన్న కారణంగా ఎస్ఐ భాను ప్రకాష్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడంతో పోలీస్ రికవరీ చేసిన బంగారాన్ని పోలీస్ స్టేషన్ నుంచి మాయం చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.మిగతా వివరాలు విచారణలో బయటపడతాయని ఉన్నతాధికారులు అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *