ఆ జట్టు స్థానంలో స్కాట్ లాండ్ కు అవకాశం
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
వచ్చే నెలలో భారత్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో ఆడేందుకు బంగ్లాదేశ్ విధించిన నిబంధనలను ఐసీసీ అంగీకరించకపోవడంతో…..ఆ జట్టు తాము టౌర్నమెంట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. బంగ్లా జట్టు ఈ నిర్ణయం తీసుకోవడంతో….ఆ జట్టు స్థానంలో స్థానంలో స్కాట్లాండ్ జట్టు టోర్నీలో పాల్గొంటుందని ఐసీసీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా గ్రూప్-సిలో బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్ భర్తీ చేసేలా మ్యాచ్ షెడ్యూల్లో ఐసీసీ మార్పులు చేసింది. బంగ్లా దేశ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో భారత పర్యటనలో తమ జట్టు భద్రతపై బంగ్లా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. భారత్ లో జరిగే మ్యాచ్ లను శ్రీలంకు మర్చాలని లేదంటే పాకిస్తాన్ జట్టుతో భారత్ అడుతున్న తఠస్థ వేదికతలను మర్చాలని బంగ్లా డిమాండ్ చేసింది. దీనికి ఐసీసీ నో చెబుతూనే బంగ్లా జట్టుకు షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి భారత్, శ్రీలంకలో టీ-20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.

బంగ్లా జట్టుకు ఎంత నష్టం అంటే….
టీ-20 ప్రపంచ కప్ లో బంగ్లా జట్టు పాల్గొనకపోవడంతో ఆ జట్టుకు ఆర్ధికంగా తీవ్ర నష్టం వాటిల్లనుంది. అంతర్జాతీయంగా జరిగే ఈ టోర్ని్లో టాప్ -12 లోకి ప్రవేశిస్తే….భారత కరెన్నీలో 4.12 కోట్ల రుపాయలు ఒక్కో జట్టుకు అందుతాయి. ఇది బంగ్లా కరెన్సీలో చూసినట్లయితే 5.5 కోట్ల టాకాలకు సమానం. పాల్గొనే అవకాశం దక్కినా కనీసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, క్రికెటర్ల, కోచింగ్ సిబ్బంది, మేనేజ్మెంట్కు దాదాపు 3 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 2.74 కోట్లు) లభిస్తాయి బంగ్లా జట్టు బహిష్కరించడంతో ఇది ఆ జట్టుకు నష్టమే. ఆర్ధికంగా అంతంత మాత్రంగానే ఉండే క్రికెట్ బోర్డులకు ఇది తీవ్ర నష్టం చేకూర్చనుంది.




Leave a Reply