కీలక అంశాలపై చర్చ
(అమరావతి,న్యూస్ఇన్)

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం బుధవారం 10 గంటలకు జరుగనుంది. ఈ సమావేవంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.అమరావతి రాజధానిగా కేంద్రం బిల్లు తెస్తుండడంతో అంతకు ముందే పలు సంస్థలకు భూమల కేటాయింపులపై మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి గ్రామాల్లో అనాథలైన పిల్లలకు పెన్షన్ పథకాన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రివర్ ఫ్రంట్ లో మెరీనా అభివృద్ధికి ఆమోదం తెలపనున్న కేబినెట్ – రాజధానిలో వీధిపోటు ప్లాట్లు 112 వేరే చోట ఇచ్చేందుకు అనుమతి ఇవ్వనున్న ప్రభుత్వం. హడ్కో నుంచి రూ.4,450 కోట్ల రుణానికి మంత్రి వర్గం అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ ల దావోస్ పర్యటనపైనా ఏపీ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం.*సంస్థలకు భూకేటాయింపులు చేసే అవకాశం కనిపిస్తోంది. దావోస్ లో జరిగిన చర్చల సారాంశాన్ని సీఎం మంత్రులకు వివరించే అవకాశం కనిపిస్తోంది.


Leave a Reply