(అమరావతి,న్యూస్ ఇన్)

కలియుగ దైవం తిరుమల శ్రీవారి ప్రసాదం చుట్టూ తిరిగిన వివాదాలకు తాత్కలికంగా బ్రేక్ దొరికినట్లయింది. గత ప్రభుత్వ హాయంలో తిరుమల పవిత్రత దెబ్బ తీశారని తీవ్ర చర్చకు దారి తీసింది. లడ్డూ తయారీలో నాణ్యత పాటించలేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశంలో అధికార పార్టీగా ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పించింది. తిరుమలలో వాడుతున్న నెయ్యిలో నాణ్యత లేకపోవడంతో ప్రసాదం నాణ్యత దెబ్బతిందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఏపీలో అధికారంలో వచ్చిన తెలుగుదేశం పార్టీ తిరుమల లడ్డూ తయారీపై సిట్ బృందం దర్యాప్తు చేసి నివేదిక సమర్పించింది. టీటీడీ వాడిన నెయ్యి నాణ్యతా ప్రమాణాల పై స్పష్టత తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి లేదంటూ సిట్ నివేదించింది. దీంతో శ్రీవారి భక్తులు కూడా ఊపిరి పీల్చుకున్నట్లవుతోంది.






Leave a Reply