అన్ని గ్రామాల్లో దిష్టిబొమ్మల దహనం
(హైదరాబాద్, న్యూస్ఇన్)
బీఆర్ ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ కు సిట్ విచారణ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపాలని పిలుపునిచ్చింది. అన్ని గ్రామాలు, పట్టణాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించింది. అన్ని గామాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్దం చేయాలని పిలుపునిచ్చింది.మున్సిపాలిటీ, నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు మరియు రాస్తారోకోలు చేయాలని పార్టీ నేతలను కోరింది. పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, బాలమల్లు, కర్నె ప్రభాకర్, ఎం ఎల్ ఏ లు వివేక్, కృష్ణారావు తదితరులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ గారిని వేధిస్తోందని, రాజకీయ వేధింపుల్లో భాగంగా ఆయనను అవమానిస్తూ అమానుషంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. టెలిఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టుకథలు సృష్టించి, ఇప్పుడు సిట్ (SIT) విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం దుర్మార్గమైన మరియు నీచమైన వైఖరి అని అభివర్ణించారు.

రేపటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం చేయాలన్నారు. వీరు సూచించారు. ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు మరియు రాస్తారోకోలు చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి నిరసన సెగ తగిలేలా చేయాలని పిలుపునిచ్చారు. నిరసనలు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఉండాలని, పోలీసులతో ఘర్షణలకు తావివ్వకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలని కోరారు.



Leave a Reply