రిజర్వేషన్లపై కోర్టులో పిటీషన్లు
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై ఎంతో పట్టుదలగా ముందుకు వెళుతున్నా…మరోసారి సర్పంచ్ ఎన్నికల్లో పలువురు కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. గురువారం నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుండడంతో….. బుధవారం పలువురు కోర్టును ఆశ్రయించారు.రిజర్వేషన్ల విధానాన్ని తప్పబడుతూ కొంత మంది కోర్టుకు వెళ్లడం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. పలు గ్రామాలకు వచ్చిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు.

నాగర్ కర్నూల్, వరంగల్, సంగారెడ్డి జిల్లాల్లో పలు పంచాయతీల రిజర్వేషన్లు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అమలు చేయడం లేదని బీసీ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.మరోవైపు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేసింది. కోర్టులో దాఖలైన పిటీషన్లపై గురువారం కోర్టు విచారణ జరుపనుంది. దీంతో సర్పంచ్ ఎన్నికలపై మరోసారి సస్పెన్స్ నెలకొంది.



Leave a Reply