NewsInn

News in a Click

కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు

కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు

తప్పు చేసినవారు ఏడుకొండలవాడికి క్షమాపణ చెప్పి తీరాలి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

ఏడుకొండలవాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచనా విధానం నుంచి, శ్రీ వెంకటేశ్వరస్వామికి ఉన్నది రెండే కొండలు అన్న వారసత్వం నుంచి పుట్టినవారు తిరుమల పవిత్రతను దిగజార్చేందుకు ఏ స్థాయికైనా దిగజారుతార’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. వారు భగవంతుడి మీదే పగ పట్టారన్నారు. భగవంతుడి మీద పగ పట్టిన వారు మట్టికొట్టుకుపోతారని తెలిపారు. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి అసలు పాల నుంచి చేసిందే కాదని రిపోర్టులో పేర్కొన్నట్టు చెప్పారు. చేసిన తప్పుకి క్షమాపణ కోరకుండా మమ్మల్ని క్షమాపణ చెప్పమని బుకాయిస్తున్నారన్నారు. ఇది హిందూ విశ్వాసాల మీద జరిగిన దాడి. తప్పు చేసిన వారు ఏడుకొండల వాడికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. కల్తీ నెయ్యి కేసులో దోషుల్లో ఏ ఒక్కరినీ కూటమి ప్రభుత్వం వదలదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో బిజెపీ రాష్ట్ర అధ్యక్షుడ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, సహచర మంత్రులతో సమావేశం అయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మతం, ధర్మం చాలా లోతైన అంశాలు. చాలా సున్నితమైనవి కూడా. అలాంటి వ్యవహారాల్లో ఒక్క మాట మాట్లాడాలన్నా చాలా ఆలోచించి మాట్లాడాలన్నారు. వైసీపీ హాయంలో దేవాలయాలపై దాడులు జరిగితే పిచ్చోడి పనన్నారు.2019 నుంచి 2024 వరకు జరిగిన వైసీపీ పాలనలో ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు.

అన్నీ మతపరంగా సున్నితమైన అంశాలే. రామతీర్ధంలో శ్రీరాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేస్తే ఎవరో ఆకతాయి చేశాడు. పిచ్చోడు చేశాడని చెప్పారు. పిఠాపురంలో దేవతా విగ్రహాలకు అశుద్దం పూస్తే అదీ పిచ్చోడి పనే అన్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు చోరికీ గురై పోతే కొత్తది కొనుక్కోవచ్చంటూ తేలికగా మాట్లాడారు. అంతర్వేదిలో రథం తగులబెడితే అదీ ఎవరో పిచ్చోడి పనే అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు 219కి పైగా జరిగాయి. ఒక్క అంశంలోనూ సరైన చర్యలు తీసుకున్నది లేదు. ఇలాంటి అంశాల్లో ఏ రోజూ రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించలేదు.

జంతు కొవ్వు ఉందని ఎన్.డి.డి.బి. రిపోర్టు చెప్పింది…..

కల్తీ నెయ్యికి సంబంధించి నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు(ఎన్.డి.డి.బి) రిపోర్టును మా అందరికీ చదివి వినిపించారు. ఒక రిపోర్టులో విజిటెబుల్ ఆయిల్స్ ఉన్నాయని ఉంది. వాళ్లు ఏ స్థాయిలో కల్తీకి పాల్పడ్డారని చెబుతూ అసలు ఆ ద్రావకంలో నెయ్యే లేదని, ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్, పంది కొవ్వు లాంటివి ఉన్నాయని రిపోర్టులో ప్రస్తావించారు. ఇది చాలా సున్నితమైన అంశం. ఈ అంశాన్ని బయటపెట్టే ముందు చాలా ఆలోచించాం. పర్యవసానాలు ఎలా ఉంటాయి అని ఆలోచించే ముందుకు వెళ్లాం.

చెప్పకపోతే తెలిసీ ఎందుకు మాట్లాడలేదు అన్న ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుందని మాట్లాడ‌క త‌ప్ప‌డం లేద‌న్నారు. ఏ నివేదిక చూసినా- అస్సలు వారు నెయ్యి అని చెబుతున్నదానిలో నెయ్యే లేదని తేలింది. తప్పు చేసినవారు మాత్రం జంతువుల కొవ్వు లేదని చెప్పి బుకాయిస్తున్నారు. వైసీపీ హయాంలో వినియోగించిన 59.70 లక్షల కేజీల నెయ్యి వాడితే అందులో 58 లక్షల కేజీలు పామ్ ఆయిల్, మిగిలింది కెమికల్స్. విచారణలో వాటి కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులు దొరికాయి. సీబీఐ నివేదికలో ఈ నెయ్యి – పాల కొవ్వులతో చేసింది కాదు అని చెప్పింది. అందులో ఏమున్నాయన్నది నిర్ధారించలేకపోతున్నాం అని మాత్రమే చెప్పింది. ఎన్.డి.డి.బి రిపోర్టులో జంతువుల కొవ్వు కలిసిందని స్పష్టంగా ఉంది. నెయ్యి లేకుండా లడ్డూలు చేసి ఎదురు మాట్లాడుతున్నారు.కల్తీ జరిగిందని 2022లోనే తెలిసినా రిపోర్టు తొక్కిపెట్టారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *