NewsInn

News in a Click

ఈ వేసవిలో మంట‌లే….. వాతావ‌ర‌ణ నిపుణులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

వాతావ‌ర‌ణ మార్పుల‌తో అన్యూహంగా ఈ సారి భారీ వ‌ర్షాలు, వ‌ణికించే చ‌లి ఈ సారి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఈ ఏడాది అనుభ‌వంలోకి వ‌చ్చింది. అల‌స్యంగా మొద‌లైనా భారీ వ‌ర్షాలు అనంత‌రం చ‌లిపులి అంద‌రిలోనూ వ‌ణుకు పుట్టించింది. ఇటీవ‌ల కాలంలో ఎన్న‌డూ లేనంత స్థాయిలో ఊష్ణోగ్ర‌త‌లు త‌గ్గిపోయాయి. రాబోయే వేస‌వి కాలంపై అప్పుడే వాతావ‌ర‌ణ శాఖ నిపుణులు (ECMWF) హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. వేస‌వి మంట‌లు కూడా తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. సాధార‌ణం కంటే ఎక్కువ‌గా ఎండ‌లు ఉండే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వేస‌వి చివ‌రి నాటికి ఎల్ నినో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేశారు. ఈ ప్ర‌భావంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధార‌ణ‌కంటే ఎక్కువ ఊష్ణోగ్ర‌త‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్ర‌భావం ఉంటుంద‌ని, ప్ర‌త్యేకంగా ఏపీలో వేస‌వి తీవ్ర‌త మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

ఎన్ నినో ప‌రిప‌క్వ ద‌శ‌కు చేరుకునే స‌మ‌యంలో ఊష్ణోగ్ర‌త‌లు గ‌తంలో కంటే అత్య‌ధికంగానే న‌మోదయ్యే చాన్స్ ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ కూడా చెబుతోంది. గ‌తంలో ఈ ప్ర‌భావం ఉన్న సంవ్త‌స‌రాల్లో దాదాపు 49 డిగ్రీల వ‌ర‌కు ఏపీలో ఊష్ణోగ్ర‌త‌లు న‌మోదైన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

గ‌తంలో ఈ ప్ర‌భావంవ‌ల్ల న‌మోదైన ఊష్ణోగ్ర‌త‌లు…

విజయవాడ – మే 2002లో 48.8°C (సార్వకాలిక రికార్డు) ఎల్ నినో ప్రారంభంతో ఏకీభవించింది.
విజయవాడ – మే 2003లో 48.7°C ఎల్ నినో కొనసాగింపుతో ఏకీభవించింది.
విజయవాడ – మే 2015లో 47.6°C ఎల్ నినో ప్రభావంతో ఏకీభవించింది.
విజయవాడ – మే 2003లో 48.7°C ఎల్ నినో కొనసాగింపుతో ఏకీభవించింది.
విజయవాడ – మే 2015లో 47.6°C ఎల్ నినో ప్రభావంతో ఏకీభవించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *