NewsInn

News in a Click

పార్సెల్ సర్వీస్ లోకి దక్షిణ మధ్య రైల్వే

అందుబాటులోకి రానున్న నెక్స్ట్ జెన్ పార్సెల్ యాప్

(హైదరాబాద్, న్యూస్ఇన్)

రైలు ద్వారా పార్శిల్‌లను బుక్ చేసుకోవాలనుకునే రైలు వినియోగదారులకు ఇంటివద్దకే పార్శిల్ బుకింగ్ మరియు డెలివరీ సేవలను అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే అడుగులు వేస్తోంది. హైదరాబాద్ డివిజన్ ప్యాసింజర్ లేదా పార్శిల్ రైళ్ల ద్వారా పార్శిల్ బుక్ చేసుకోవాలనుకునే వినియోగదారులకు ఇంటివద్దకే సజావుగా పార్శిల్ బుకింగ్ మరియు డెలివరీ సేవలను అందించే లక్ష్యంతో, మొదటి మైలు మరియు చివరి మైలు కనెక్టివిటీని అనుసంధానించే విధంగా మొబైల్ యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ సేవలు ప్రయోగాత్మకంగా హైదరాబాద్ డివిజన్ వ్యాప్తంగా అందుబాటులో కి రానుంది.

యాప్ యొక్క ప్రయోజనాలు……

ఆన్‌లైన్ బుకింగ్ మరియు డిజిటల్ చెల్లింపులు

రియల్ టైమ్ పార్శిల్ ట్రాకింగ్.

సజావుగా ఎండ్-టు-ఎండ్ సర్వీస్

సేవలు వినియోగదారులకు ఇంటివద్దకే పార్శిల్ సేవను అందించడం ద్వారా పార్శిల్ రవాణాలో కీలకమైన మార్పు దిశగా కాగలదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు

ఆసక్తి ఉంటే సంప్రదించండి…..

జోన్ పరిధిలో ఆసక్తిగల పార్టీలు లేదా ఏజెన్సీలను ఫస్ట్ మైల్ (పికప్) మరియు లాస్ట్ మైల్ (డెలివరీ) సేవలను మిడ్ మైల్ (రైల్వే ద్వారా రవాణా) తో సమన్వయ పరిచే విధంగా లాజిస్టిక్స్ సేవలను అందించాలనుకునే వారు రైల్వే వాణిజ్య విభాగాన్ని మెయిల్ ద్వారా లేదా స్వయంగా సంప్రదించవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *