- తడబడ్డ బ్యాటింగ్ లైనప్
- అతి విశ్వాసంతో బ్యాక్ టు బ్యాక్
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ ఇన్)
టీ-20 ప్రపంచ కప్ క్రికెట్లో ఢిల్లీలో జరిగిన భారత్- నమీబియా మ్యాచ్ లో భారత జట్టు బ్యాట్స్ మెన్లు తడబడ్డారు. పసికూన జట్టుతో ఆడుతున్నామన్న అతి విశ్వాసంతో బాధ్యతా రాహిత్య బ్యాటింగ్ కు చేసి మూల్యం చెల్లించుకునే దాకా పరిస్థితి తెచ్చుకున్నారు. 93 పరుగుల తేడాతో విజయం సాధించినా….. క్రికెట్ లో పసికూన లాంటి జట్టుతో బ్యాటింగ్ చేసేందుకు తడబడడం చర్చకు దారిస్తోంది. బౌలింగ్ లో బూమ్రా, అర్షదీప్ లు ఈ మ్యాచ్ లో పెద్దగా రాణించలేకపోయారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఓపెనింగ్ భాగస్వామ్యం జోరు మీద కనిపించినా ఫాంలో లేని సంజూశాంసన్ యధావిధిగా కొద్ది సేపట్లోనే ఔటయ్యారు. 8 బంతులు ఎదుర్కొన్న సంజు 3 సిక్స్ లు ఒక ఫోర్ కొట్టి ఫాంలోకి వచ్చానన్న సంకేతాలు ఇచ్చారు. 22 పరుగులు చేసిన సంజు 25 పరుగల వద్ద భారీ షాట్ ఆడబోయి వెనుదిరిగారు. ఆ తరువాత ఇషాన్ కిషన్ బ్యాటింగ్ లో తన జోరు మరోసారి చూపించారు. ఇషాన్ కిషన్ కు తిలక్ వర్మ తోడు కావడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనించింది. 7.1 ఓవర్లలోనే 104 పరుగులు సాధించిన భారత జట్టు అక్కడే రెండో వికెట్ ఇషాన్ కిషన్ రూపంలో కోల్పోయింది. 24 బాల్స్ ఎదుర్కొన్న ఇషాన్ 5 సిక్స్ లు 6ఫోర్ల సహాయంతో 61 పరుగులు సాధించి ఔటయ్యారు.11 ఓవర్లో కెప్టన్ సూర్యకుమార్ యాదవ్12 ఓవర్లో తిలక్ వర్మలు వెంట వెంటనే వెనుదిరిగారు. సూర్య12, వర్మ 25 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నారు. అప్పటికీ భారత జట్టు స్కోరు 12 ఓవర్లలో 124 పరుగలకు చేరుకుంది. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన హర్దిక్ పాండ్య, శివమ్ దుబేలు మరోసారి భారత ఇన్నింగ్స్ లో పరుగులు భారీగా రాబట్టారు. ఐదో వికెట్ భాగస్వామ్యానిక 18.2 ఓవర్లలో 205 పరుగులకు భారత జట్టు స్కోరు చేరింది. హార్దిక్ 28 బాల్స్ ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్స్ లు కొట్టి 52 పరుగులు సాధించారు. దుబే 16 బంతుల్లో 23 పరుగులు చేశారు.మంచి టచ్ లో కనిపించిన ఇద్దరు ఒకే ఓవర్లో ఔట్ కావడంతో అక్సర్ పటేల్ వికెట్ కూడా భారత జట్టు అక్కడే కోల్పోయింది.దీంతో భారత జట్టు స్కోరు మళ్లీ మందగించింది. 18వ ఓవర్ పూర్తయ్య సరికి 7 వికెట్లు కోల్పోయి 205 పరుగు భారత జట్టు చేరుకుంది.19వ ఓవర్లో కూడా భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో 20 ఓవర్లు పూర్తయ్యే వరకు 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది.

210 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన నమీబియా జోరుగానే ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఆ జట్టు బ్యాట్స్ మెన్లు పరుగులు సాధించాలన్న తపనతో హిట్టింగ్ చేశారు. భారత బౌలర్లను ఎదుర్కొని 4 ఓవర్లలోనే 33 పరుగులు చేసిన జట్టు తొలి వికెట్ అక్కడ కోల్పోయింది. జాన్ ఫ్రిక్లిక్ 15 పరుగుల్లో 3 ఫోర్లు 1 సిక్సతో 22 పరుగులు చేసి అర్షదీప్ చేతిలో ఔటయ్యారు. ఆతరువాత జట్టు స్కోరును పెంచేందుకు నమీబియా బ్యాట్సమెన్లు ఆచితూచి పరుగులు రాబట్టుకున్నరు. 7.1 ఓవర్లలో 67 పరుగులు సాధించిన తరువాత లారెన్ స్టీన్ క్యాంప్ 20 బంతులు ఎదుర్కొని ఒక సిక్స్ 3 ఫోర్ల తో 29 పరుగులు చేసి వరణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఔటయ్యారు. 10వ ఓవర్లకు మ్యాచ్ చేరుకోవడంతో రన్ రేట్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో పరుగులు సాధించేందుకు ప్రయత్నం చేసిన నమీబియా ఆటగాళ్లు వెనుదిరిగారు. 10 వ ఓవర్లోనే 83 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టారు. 2 ఓవర్లు వేసిన వరుణ్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టారు. దీంతో భారత జట్టు నమీబీయా పై ఆధిపత్యంలోకి వచ్చింది. ఆ తరువాతి ఓవర్లోనే అక్షర్ కెప్టెన్ ఎరాస్మస్ వికెట్ పడగొట్టడంతో ఆ జట్టు స్కోరు11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 85 పరుగులు మాత్రమే చేయగలిగింది.
నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ భారత్ కుట్రలు అని ముందే చెప్పాడు…
13 ఓవర్లలో94 వద్దకు జట్టు స్కోరు వద్ద అక్సర్ పటేల్ బౌలింగ్ లో మలాన్ కృగార్ భారీ హిట్టింగ్ చేసే ప్రయత్నం చేసి బూమ్రా అధ్బుతమైన క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగారు. ఆతరువాత మరో ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేసిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే అలౌట్ అయింది. భారత జట్టులో వరుణ్ 3, అక్సర్ 2,హర్దిక్ పాండ్య 2 వికెట్లు తీసుకున్నారు.




Leave a Reply