కోర్టు నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పర్వం మొదలుకోవడంతో పలు అంశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. పంచాయతీ ఎన్నికలపై పలువురు కోర్టుకు వెళుతున్నారు. ప్రభుత్వపరంగా ఈ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసింది.ముగ్గురు సూపరిండెంట్ స్థాయి అధికారులతో లీగల్ సెల్ఎన్నికల్లో రిజర్వేషన్లను సవాలు చేస్తూ కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో లీగల్ సెల్ ఏర్పాటు. ఎన్నికలు నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేసే విధంగా, ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా వెంటనే చర్యలు తీసుకుంది.

జిల్లాలతో సమన్వయం చేయనున్న లీగల్ సెల్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు — కేసులకు సంబంధించిన వివరాలు మరియు సూచనలు 24 గంటల్లోపుగా అదనపు అడ్వొకేట్ జనరల్, గవర్నమెంట్ ప్లీడర్ కి నివేదించాలని ఆదేశాలు ప్రతి జిల్లాలో కోర్టు కేసులను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని, కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన లీగల్ సెల్తో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసింది.


Leave a Reply