NewsInn

News in a Click

నిత్యవసరాలు ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారా !!!

గడువు తీరిన వస్తువులు

కుళ్ళిన కూరగాయలు

(హైదరాబాద్,న్యూస్ ఇన్)

పెరిగిన సాంకేతికత , అందుబాటులో కి వచ్చిన ఆన్లైన్ సేవలతోఉప్పు ,పప్పులను కూడా చాలామంది ఆన్లైన్ లోనే ఆర్డర్ వేస్తూ తెప్పించుకుంటున్నారు. నిత్యవసర సరుకులు సహా ఏ అవసరం ఉన్న ఆన్లైన్ మార్కెటింగ్ పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. ఈ అంశాన్ని ఆసరాగా తీసుకుంటున్న ఆన్లైన్ వ్యాపారాలు నిర్వహించే సంస్థలు తమ గిడ్డంగుల్లో సమయం దాటిపోయిన పదార్థాలు, నాసిరకం ఉత్పత్తులు ఉంచి ఆర్డర్ చేసిన కస్టమర్లకు అంటగడుతున్నాయి.

ఎన్నో ఫిర్యాదులు అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ఈ కామర్స్ గోడౌన్ లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గడువు తీరిన సరుకులతో పాటు కుళ్లిపోయిన పదార్థాలను గుర్తించారు. రెండు రోజులపాటు అధికారులు జెప్టో, రిలయన్స్ జియోమార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జోమాటో, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు నిర్వహించే 75 యూనిట్లను తనిఖీ చేశారు. 98 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు 122 నమూనాలను సేకరించారు. ఈ గోడౌన్లలో 1,903 యూనిట్ల గడువు ముగిసిన ఆహార పదార్థాలను తప్పుగా బ్రాండ్, లేబుల్ చేయబడిన ఆహార వస్తువులను గుర్తించారు. 76 కిలోల గడువు ముగిసిన కిరాణా వస్తువులు, పాత ఆహారం, కుళ్ళిన కూరగాయల నిలువ ఉంచడంతో నోటీసులు జారీ చేసారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసే నిత్యవసర వస్తువుల గడువును పరిశీలించి కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. తప్పుడు సరుకులు అందిన కల్తీ వస్తువులు సరఫరా చేసిన తమకు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *