NewsInn

News in a Click

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ వ‌ర్షాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌))

వాతావ‌ర‌ణ శాఖ అంచచ‌నాలు నిజం అయ్యాయి. 22 వ తేదీ నుంచి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వారం రోజుల క్రితమే హెచ్చ‌రించింది. ఆదివారం ఏపీలోని అన‌కాప‌ల్లి స‌హా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసాయి. ఆర్ధ‌రాత్రి దాటిన త‌రువాత ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వ‌ర్షం కురిసింది. ఒక్క సారిగా వాతావ‌ర‌ణంలో మార్పులు చోటు చేస‌కుని వ‌ర్షం కురిసింది.బంగాళా ఖాతంలో ఏర్ప‌డిన ఆల్ప‌పీడ‌న ప్ర‌భావంతో అకాల వ‌ర్షాల‌కు అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేసింది. మ‌రో రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కురిసే చాన్స్ ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది. ఈ రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని, హైద‌రాబాద్ లో కూడా వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండి త‌మ నివేదిక‌లో వెల్ల‌డించింది. ప్ర‌జ‌లు, అధికారులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వాతావ‌ర‌ణ శాఖ సూచించింది.

వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌…

మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి – భోంగీర్, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, కెబి ఆసిఫాబాద్‌లలో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అక్కడక్కడా ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు

రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి -భువ‌న‌గిరి , మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేటలో రాత్రి – ఉదయం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.

హైదరాబాద్ లో సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే చాన్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *