NewsInn

News in a Click

కామారెడ్డి దగ్గర కవిత హై డ్రామా

రైలు రోకో అరెస్ట్

(హైదరాబాద్, న్యూస్ ఇన్)

పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామారెడ్డి సమీపంలో రైల్ రోకో చేపట్టారు. జాగృతి కార్యకర్తలు, బీసీ సంఘాలతో కలిసి ఒక్కసారిగా రైలు ట్రాక్ పై బైఠాయించడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పోలీసులు రావడానికి కొద్దిగా సమయం జరగడంతో జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత దాదాపు అరగంటసేపు రైల్వే ట్రాక్ పై ఉన్నారు. అదే సమయంలో దేవగిరి ఎక్స్ప్రెస్ సహా మరి కొన్ని రైళ్లు సమీపంలోని స్టేషన్లోనే ఆగిపోవాల్సి వచ్చింది. దాదాపు అరగంట తర్వాత రైలు రోకో ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కవితను అరెస్టు చేసి తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *