
తెలంగాణా జాగృతి కవిత
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మూసీ నది మధ్యలో నిర్మాణం చేస్తున్న భవన నిర్మాణం హైడ్రా కు కనిపించడం లేదా అని తెలంగాణా జాగృతి అధ్యక్షులు కవిత ప్రశ్నించారు. మూసీ సుందరీ కరణ పేరుతో పేదలు చిన్న ఇళ్లు కట్టుకుంటే కూల్చి వేస్తున్న హైడ్రా భారీ నిర్మాణంపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్నారు. మంగళవారం ఆ నిర్మాణం వద్ద కవిత ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పు బట్టారు. రాష్ట్రంలోని ఎన్నో ప్రాంతాల్లో పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చి వేస్తోందన్నారు. ఈ భవన నిర్మాణంపై కవిత ధర్నా చేస్తున్న ప్రాంతం నుంచి హై డ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫోన్ చేస్తే కలెక్టర్ల సమావేశంలో ఉన్నానని చెప్పారు.

మూసీలో నిర్మాణం చేస్తున్న భవన నిర్మాణాన్ని కూల్చి వేసే వరకు తాము నిరసనను కొనసాగిస్తామని కవిత ప్రకటించారు. తెలంగాణా జాగృతి నిర్వహించిన జనం బాట కార్యక్రమంలో ఎన్నో అక్రమ నిర్మాణాలపై తాము ఫిర్యాదు చేసినా హైడ్రా పట్టించుకోలేదని కవిత ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంతంలో 20 ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన మధు రిడ్జ్ ఆపార్ట్ మెంట్ వాసులను ఇబ్బందులు పెడుతున్నారని, ఇప్పుడే నిర్మాణాలు చేస్తున్న భవన నిర్మాణాన్ని మాత్రం అపడం లేదన్నారు. గత ప్రభుత్వ హాయంలో మూసీలో భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వరకు పనులు ఆపిన నిర్మాణ సంస్థ ఆ తరువాత పనులు మొదలు పెట్టారని ఆరోపించారు.



Leave a Reply