NewsInn

News in a Click

మార్చి 6 నుంచి ప్ర‌జ‌ల్లోకి ప్ర‌జా ప్ర‌భుత్వం

అయిదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

స్థానిక సంస్థ‌ల్లో భారీగా స్థానాలు గెలుచుకోవ‌డంతో అదే జోష్ లో సీఏం రేవంత్ రెడ్డి పాల‌న‌పై దూకుడు పెంచుతున్నారు. రాష్ట్రంలో 99 రోజు ల‌పాటు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యాచ‌ర‌ణ సిద్ధం చేశారు. స‌చివాల‌యంలో దీనికి సంబంధించిన కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించి క‌లెక్ట‌ర్లు, ఉన్న‌తాధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. 99 రోజుల పాటు అధికారులు చేపట్టాల్సిన కార్య‌క్ర‌మాల‌పై దిశా నిర్దేశం చేశారు. మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వ‌హ‌ణ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్ ను ప్ర‌భుత్వం సిద్ధం చేసింది. ప్రణాళిక శాఖ ఈ కార్యక్రమానికి నోడల్ శాఖ గా వ్యవహరించ‌నుంది.

ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ప్ర‌ణాళిక‌……

ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభలు

ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం

మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం

మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక

శాఖల వారీగా 10 వివిధ థీమ్ లతో 99 రోజుల కార్యక్రమం

  1. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్
  2. ఆరోగ్యం
  3. అరైవ్.. అలైవ్
  4. సంక్షేమం
  5. పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట
  6. రైతు సంక్షేమం.. వ్యవసాయం
  7. విద్య
  8. యువత.. క్రీడలు
  9. మహిళలు
  10. పర్యావరణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *