కోకాపేటలో కోట్లు కురిపించిన వేలం
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) 28 నవంబర్ 2025న నిర్వహించిన నీయోపోలిస్ ఈ–ఆక్షన్ రెండో విడతను విజయవంతంగా పూర్తిచేసింది. 24 నవంబర్ న జరిగిన మొదటి విడతలో సాధించిన అత్యద్భుత ఫలితాలను మించిపోతూ, ఈ విడత మరింత ఆశ్చర్యకర విజయాలను నమోదు చేసింది. భూవిలువలు వేగంగా పెరగడం, పోటీ తీవ్రమవ్వడంతో నియోపోలిస్ దేశంలో అత్యంత విలువైన భూ విలువ కేంద్రాలలో ఒకటిగా తన స్థానం మరింత బలపరుచుకుంది.
ఈ ఆక్షన్లో 4.03 ఎకరాల విస్తీర్ణం గల ప్లాట్ 15 మరియు 5.03 ఎకరాల ప్లాట్ 16ను హರಾಜుకు ఉంచారు. ఉదయం 11:00 గంటలకు ప్రారంభమైన బిడ్డింగ్ సాయంత్రం 6:30 గంటలు దాటేంతవరకు అత్యంత ఉత్సాహంగా కొనసాగింది. ఇది డెవలపర్ల నుంచి వచ్చిన గట్టి ఆసక్తిని, పోటీ తీవ్రతను ప్రతిబింబిస్తుంది.

ప్లాట్ 15 ఎకరాకు ₹151.25 కోట్ల విలువ వద్ద ముగిసింది. ఈ ప్లాట్ను లక్ష్మీ నారాయణ గుమ్మడి, కార్తీశ్ రెడ్డి మద్గుల, శరత్ వెంట్రప్రగడ మరియు శ్యామ్ సుందర్ రెడ్డి వంగాల తీసుకున్నారు. ప్లాట్ 16 ఎకరాకు ₹147.75 కోట్ల విలువ వద్ద ముగిసి, గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ ఈ ప్లాట్ను సొంతం చేసుకుంది. ఈ రెండు ప్లాట్ల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి మొత్తం ₹1352 కోట్లు లభించాయి. మొదటి విడతలో వచ్చిన ఆదాయం కలుపుకుని, ఇప్పటివరకు నీోపోలిస్ ఆక్షన్ల ద్వారా సమకూరిన మొత్తం విలువ ₹2708 కోట్లకు చేరుకుంది.

ఈ రికార్డు స్థాయి ఫలితాలతో, ఒక్క ఎకరానికి సగటు విలువ ₹142.83 కోట్లకు చేరింది. ఇది హైదరాబాద్ భూముల మార్కెట్లో ఇప్పటివరకు కనిపించిన అత్యధిక పెరుగుదలలలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. నీోపోలిస్ ఒక అభివృద్ధి చెందుతున్న ప్రీసింక్ట్ నుంచి ప్రముఖ జాతీయ మరియు ప్రాంతీయ డెవలపర్లకు ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదిగిందని ఫలితాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.
రెండు విడతలూ వరుసగా రికార్డు స్థాయిలో విలువలు సాధించడంతో, డిసెంబర్ 03న నీోపోలిస్లో మరియు డిసెంబర్ 05న గోల్డెన్ మైల్లో నిర్వహించనున్న ఈ–ఆక్షన్లపై డెవలప్మెంట్ కమ్యూనిటీ నుంచి మరింత బలమైన ఆసక్తి ఉండనుందని అంచనా.



Leave a Reply