
కర్నాటక సీఏం సిద్దూ పై తీవ్ర ఆరోపణలు
(బెంగుళూరు, న్యూస్ఇన్)
తెలంగాణాలో గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందంటూ రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కేసును నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇదే సమయంలో కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఫోన్ ట్యాపింగ్ వివాదం చుట్టుముడుతోంది. కర్నాటకలో పవర్ షేరింగ్ విషయం గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సీఏం పదవి కట్టబెట్టాలన్న చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత సీఎం సిద్దిరామయ్య రెండున్నరేళ్ల పదవి కాలం పూర్తి కావడంతో ఆయన స్థానంలో డీకేను సీఎంగా నియమించాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది.

డీకే కూడా పార్టీ పెద్దలను సీఎం పదవి కోసం ఒప్పించే యత్నాలు చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం ఢిల్లీ పెద్దలను కలిసి డీకే తనకు 130 మంది శాసనసభ్యుల బలం ఉందని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు కూడా ఒప్పందం ప్రకారం సీఎం సీటు షేరింగ్ జరుగాల్సి ఉందన్న అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం సిద్దూ…… డీకే వర్గం నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. కర్నాటకలో ప్రతిపక్ష పార్టీలు ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేయడంతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని అమాత్యులు స్పందిస్తుండడం వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నట్లు అవుతోంది. ఫోన్ ట్యాపింగ్ పై హోమంత్రి పరమేశ్వరన్ మాట్లాడుతూ ఇందులో కొత్తే ముందని వ్యాఖ్యలు చేయడంతో పాటు ఏ ప్రభుత్వమైన గూఢాచార వ్యవస్థ ద్వారా సమాచారం సేకరిస్తుందన్నారు.

ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో….
సిద్దరామయ్య ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక అధికారిని నియమించి, అనధికార ప్రత్యేక దర్యాప్తు చట్టం(సిట్)ను ఏర్పాటు చేశాడని విపక్ష నేత ఆర్.అశోక్ తీవ్ర ఆరోపణలు చేశారు.కేంద్ర మంత్రి కుమార స్వామి మాట్లాడుతూ సీఎం కుర్చీ రక్షించుకునేందుకు సిద్దూ సొంత ఎమ్మెల్యేలపై నిఘా వేశారన్నారు.
తమను విడగొట్టే యత్నం… సిద్దూ
నాకు, డిప్యూటీ సీఎం శివకుమార్ కు మధ్య ఎలాంటి విబేధాలు లేవని పాలు, తేనెలా కలిసి ఉంటే విడగొట్టేందుకే విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని సిద్ది రామయ్య అన్నారు. ఎమ్మెల్యేలు, ఢిల్లీ పెద్దలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదని వ్యాఖ్యలు చేశారు.




Leave a Reply