(హైదరాబాద్,న్యూస్ఇన్)
స్వదేశీ సాంకేతికతను మరింత మెరుగు పరుచుకునే దిశగా జాతీయ సంస్థలు అడుగులు వేస్తున్నాయి. ఇస్రో
హైదరాబాద్లోని సీఎస్ఐఆర్–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్-ఐఐసీటీ), స్వదేశీ టెక్నాలజీని సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎం ఓయూ కుదుర్చుకున్నాయి. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ)లో ఈ ఎంఓయూ ఎంఓ యు పై సంతకాలు చేశాయి.ఈ ఒప్పందం దేశ సాంకేతిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేయనుంది. దిగుమతి చేసుకునే ప్రత్యేక ఫ్లోరోకెమికల్స్పై ఆధారపడటాన్ని తగ్గించనుంది. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు దోహదపడే అవకాశం ఉంటుంది.
ఈ సందర్భంగా CSIR-IICT డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, శాస్త్రీయ ఆవిష్కరణలను జాతీయ ప్రాముఖ్యత కలిగిన సాంకేతికతలుగా మార్చడంలో VSSCతో ఈ సహకారం నిదర్శనమని పేర్కొన్నారు. ఫ్లోరోకెమికల్స్కు కీలకమైన సాంకేతికతలలో ఒకటైన హైడ్రోజన్ ఫ్లోరైడ్ (HF)ను సురక్షితంగా నిర్వహించడానికి అవసరమైన ప్రత్యేక మౌలిక సదుపాయం కల్పిస్తుందన్నారు. ఫ్లోరోకెమికల్ పరిశోధనలో CSIR-IICT విశిష్టమైన సామర్థ్యాలను నెలకొల్పిందని ఆయన హైలైట్ చేశారు. ఈ భాగస్వామ్యం స్వదేశీ, పర్యావరణ అనుకూల ఫ్లోరోకెమికల్స్ అభివృద్ధిలో మరింత వేగంగా చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోందన్నారు. స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడమే VSSCతో ఈ సహకారం యొక్క లక్ష్యమని ఆయన తెలిపారు.
సీఎస్ఐఆర్-ఐఐసీటీ ప్రతినిధి బృందానికి సీఎస్ఐఆర్-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి నేతృత్వం వహించారు. ఈ బృందంలో శాస్త్రవేత్త డాక్టర్ నెట్టెం చౌదరి, డాక్టర్ ప్రవీణ్ లిఖర్, హెడ్, బిడిఆర్ఎమ్, డాక్టర్ పున్న నాగేందర్, సైంటిస్ట్-ఇ. ఈ విఎస్ఎస్సి ప్రతినిధి బృందంలో డాక్టర్ రాజీవ్ యు.పి., సైంటిస్ట్ & డైరెక్టర్, విఎస్ఎస్సి; శ్రీ ఆర్. మురళీకృష్ణన్, విఎస్ఎస్సి డిప్యూటీ డైరెక్టర్ నల్లపెరుమాళ్ ఎ.ఎమ్ తదితరులున్నారు.
–













Leave a Reply