NewsInn

News in a Click

అభిషేక్ అదే ఫాం….సింగిల్ డిజిట్ కే ఔట్

భారీ స్కోరు దిశ‌గా భార‌త్

హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న సంజు శాంస‌న్

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌)

టీ-20 ప్ర‌పంచ క‌ప్ లో భార‌త జ‌ట్టు ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శ‌ర్మ త‌న బ్యాటింగ్ ఫాం ను య‌ధావిధిగా కొన‌సాగిస్తున్నారు. తొలి నాలుగు మ్యాచ్ ల‌లో 0 ప‌రుగులు చేసిన అభిషేక్ ఆ త‌రువాత ఒక హాఫ్ సెంచ‌రీ చేసి అంద‌రిలోనూ ఆస‌క్తి రేపారు. ప్ర‌పంచ‌క‌ప్ మొద‌లైన నాటి నుంచి అభిషేక్ పైనే అంద‌రి దృష్టి ఉంది అంత‌కు ముందు జరిగిన సీరీస్ లో అద్భుతంగా రాణించిన అభిషేక్ పై భారీ అంచ‌నాలు అభిమానులు పెంచుకున్నారు. త‌న స్థాయి త‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేస్తే భార‌త జ‌ట్టు తిరుగ‌లేని ఆధిక‌త్య‌తో స్కోరు చేయ‌డం ఎంతో సులువవుతుంద‌ని క్రికెట్ అభిమానుల అంచ‌నా. కానీ ప్ర‌పంచ క‌ప్ లో అభిమానుల అంచ‌నాల‌కు అనుగుణంగా ఏ మ్యాచ్ లో కూడా అభిషేక్ రాణించ లేదు. ఓ ద‌శ‌లో అభిషేక్ ను త‌ప్పించి కొత్త ఆట‌గాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌న్న చ‌ర్చ కూడా జ‌రిగింది. మ‌రో ఓపెన‌ర్ సంజు శాంస‌న్ పై కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్య‌క్తం అయింది. కానీ కీల‌క మ్యాచ్ లో సంజు ఒంటి చేత్తో భార‌త్ ను సెమీస్ కు చేర్చారు. దీంతో సంజు ఆట అభిమానుల అనుమానాలు పఠాపంచ‌ల‌య్యాయి. ఇక అభిషేక్ మాత్రం ప్ర‌పంచ‌క‌ప్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ్యాచ్ లో అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయారు. తాజాగా ఇంగ్లాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో కూడా అభిషేక్ మ‌రోసారి నిరాష ప‌రిచారు. కేవ‌లం 9 ప‌రుగులు చేసి 2 ఓవ‌ర్ లోనే ఔట‌య్యారు. దీంతో 20 ప‌రుగ‌ల‌కు భార‌త్ తొలి వికెట్ అభిషేక్ రూపంలో కోల్పోయింది.

మ‌రో వైపు సంజుశాంస‌న్ త‌న ఫాంను కొన‌సాగిస్తున్నారు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ చేసుకుని 8.3 ఓవ‌ర్ల‌లో భార‌త జ‌ట్టు స్కోరును వంద ప‌రుగులు దాటించారు. అభిషేక్ త‌రువాత క్రీజ్ లోకి వ‌చ్చిన ఇషాన్ కిషన్- సంజు శాంస‌న్ లు ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించారు. 12 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి భార‌త జ‌ట్టు రెండు వికెట్లు కోల్పోయి 145 ప‌రుగులు చేసింది. ఇషాన్ కిష‌న్ 18 బంతుల్లో 39 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. ఆ త‌రువాత బ్యాటింగ్ ఆర్డ‌ర్ లో మార్పుతో దుబే బ్యాటింగ్ వ‌చ్చారు. శాంస‌న్ 76 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. శివం దుబే 17 ప‌రుగుల‌తో ఆడుతున్నారు. స‌గ‌టున ఓవ‌ర్ కు 10కి పైగా ప‌రుగులు సాధిస్తుండ‌డంతో భార‌త్ 220 ప‌రుగుల భారీ స్కోరు సాధించే అవ‌కాశం క‌నిపిస్తోంది.ఈ మ్యాచ్ లో గెలిచిన జ‌ట్టే న్యూజీలాండ్ తో ఫైనల్స్ లో త‌ల‌ప‌డ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *