
క్యాచ్ డ్రాప్ పై సంజు శాంసన్
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో సంజు శాంసన్ ఇన్నింగ్స్ భారత జట్టు భారీ స్కోరు దిశగా అడుగులు వేయించింది. సంజు ఇన్నింగ్స్ తో మిగిలిన బ్యాట్స్ మెన్లు కూడా దూకుడు పెంచడంతో భారత్ భారీ స్కోరు ను చేరుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన సమయంలోనే యధావిధిగా అభిషేక్ ఔటయ్యారు. కానీ మరో ఎండ్ లో ఉన్న సంజు స్కోరు పెంచే ప్రతయ్నంలో బ్యాటింగ్ చేస్తూ వచ్చారు. సంజు స్కోరు 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు సులువైన క్యాచ్ ఇచ్చారు. ఇంగ్లాండ్ కెప్టన్ హ్యారీ బ్రూక్ చేతిలో బాల్ పడినా…అది వెంటనే జారవిడిచారు. దీంతో ఆ లైఫ్ తో బతికి బయటపడ్డ సంజు మరోసారి తన బ్యాటింగ్ తో భారత్ భారీ స్కోరు దిశగా తీసుకెళ్లారు. 42 బంతుల్లో 89 పరుగులు చేసి 14 వ ఓవర్ లో సంజు ఔటయ్యారు. దీనిపై మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సంజు అదృష్టం….దురదృష్టం కలిస్తుంటాయి. క్యాచ్ లు డ్రాప్ కావడం సహజం అయితే దాని గురించి ఆలోచించకుండా మరింత బలంగా కొట్టడంపై నే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. అప్పుడప్పుడూ అదృష్టం కలిసి వచ్చిందని సంతోషంగా ఉన్నా….వంద పరుగులు చేయడానికి దురదృష్టం వెంటాడిందని సంజు వ్యాఖ్యానించడంతో మీడియా సమావేశంలో నవ్వులు విరిశాయి.


Leave a Reply