NewsInn

News in a Click

బూమ్రా బౌలింగ్….. ప‌టేల్ ఫీల్డింగ్ హైలెట్

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

ఇంగ్లాండ్ తో భార‌త్ జ‌ట్టు ఆడిన కీల‌క సెమీఫైన‌ల్స్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు అన్ని విభాగాల్లో ఆధిప‌త్యం చూప‌డంతోనే స్వ‌ల్ప ఆధిక్య‌త‌తో విజ‌యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 254 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. అనంత‌రం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ వికెట్ల‌ను కోల్పోతున్నా…. భారీ స్కోరును ఏమాత్రం బెరుకు లేకుండా విజ‌యాన్ని సాధించాల‌న్న క‌సితో ఇంగ్లాండ్ జ‌ట్టు బ్యాటింగ్ చేసింది. 95 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయినా….. విజ‌యం అంచుల వ‌ర‌కు ఇంగ్లాండ్ వ‌చ్చింది. ప‌వ‌ర్ ప్లే లో ఇంగ్లాండ్ వికెట్లు కోల్పోవ‌డ‌తో భార‌త్ విజ‌యం ఖాయం అని అంచనా వేసినా….ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల వీర‌విహారంతో మ్యాచ్ పై అనుమానాలు మొద‌ల‌య్యాయి. చివ‌రి మూడు ఓవ‌ర్ల‌లోనే భార‌త్ వైపు మ్యాచ్ మ‌ళ్లింది. కీల‌క బ్యాట్స్ మెన్ల‌ను ఔట్ చేయ‌డం, ఇంగ్లాండ్ కు మ్యాచ్ ను దూరం చేయ‌డంతో బార‌త జ‌ట్టులో మ‌రో ఇద్ద‌రు ఆట‌గాళ్లు కూడా కీల‌క పాత్ర పోషించారు. మ్యాచ్ ప్రారంభంలోనే బూమ్రా బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు బ్రూక్ ప్ర‌య‌త్నం చేయ‌డంతో బాల్ గాలిలోకి లేసింది……ఈ క్యాచ్ ను తీసుకునేందుకు అక్ష‌ర్ ప‌టేల్ దాదాపు 25 మీట‌ర్ల దూరం గ్రౌండ్ లో వెనుక వైపుకు ప‌రిగిత్తి ప‌ట్టుకోవ‌డంతో బ్రూక్ ఇన్నింగ్స్ ముగిసింది. అంత‌కు ముందు ఫిల్ సాల్ట్ హార్దిక్ పాండ్య బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో అక్ష‌ర్ ఆ క్యాచ్ ను అందుకున్నారు. అర్ష‌దీప్ బౌలింగ్ లో ఇంగ్లాండ్ అల్ రౌండ‌ర్ విల్ జాక్స్ జోరు మీద బ్యాటింగ్ చేస్తూ బౌండ‌రీ లైన్ వ‌ద్ద అక్ష‌ర్ అధ్బుతంగా బాల్ ను అందుకుని శివం దుబె కు అందివ్వ‌డంత జాక్స్ వికెట్ కీల‌క స‌మ‌యంలో ఇంగ్లాండ్ కోల్పోయింది.

ఈ క్యాచ్ అక్ష‌ర్ ఖాతాలో ప‌డ‌క‌పోయినా…ఇది ఫీల్డింగ్ కే హైలెట్ గా నిలిచింది. చివ‌రి 3 ఓవ‌ర్ల‌లో ఇంగ్లాండ్ 45 ప‌రుగులు సాధించాల్సిన స‌మ‌యంలో 18 వ ఓవ‌ర్ బౌలింగ్ వేసిన బూమ్రా ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ల‌ను పూర్తి స్థాయిలో క‌ట్ట‌డి చేయ‌గ‌లిగారు. ఆ ఓవ‌ర్ లో కేవ‌లం ఆరు ప‌రుగులు మాత్ర‌మే ఇవ్వ‌డంతో ఇంగ్లాండ్ వ‌త్తిడి బాగా పెరిగింది. ఆ ఓవ‌ర్ కార‌ణంగానే ఇంగ్లాండ్ పై మ్యాచ్ లో భార‌త్ ప‌ట్టు భిగించింది. ఆ త‌రువాత రెండు ఓవ‌ర్ల‌లో 39 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా పాండ్య వేసిన 19 వ ఓవ‌ర్లో 9 ప‌రుగులు మాత్ర‌మే ఇంగ్లాండ్ రాబ‌ట్ట గ‌లిగింది. చివ‌రి ఓవ‌ర్ లో 30 ప‌రుగులు చేయాల్సి ఉన్నా 22 ప‌రుగ‌ల‌ను ఇంగ్లాండ్ తీసుకుంది. దీంతో 7 ప‌రుగుల తేడాతో భార‌త్ ఇంగ్లాండ్ పై విజ‌యం సాధించింది. మ్యాచ్ అనంత‌రం ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసిన సంజు శాంస‌న్ ప్లేయ‌ర్ ఆఫ్ దీ మ్యాచ్ అవార్డు బూమ్రాకు ఇవ్వాల్సి ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశరంటే బూమ్రా ఈ మ్యాచ్ లో భార‌త్ ను ఫైన‌ల్ చేర్చ‌డంలో ఏస్థాయిలో బౌలింగ్ చేశారో అర్ధం చేసుకోవ‌చ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *