NewsInn

News in a Click

ఫీజు లేదు….. బ్లాంక్ చెక్ ఇవ్వండి..!

ఫీజు లేదు….. బ్లాంక్ చెక్ ఇవ్వండి..!

ఇంజనీరింగ్ కళాశాలల కొత్త ఎత్తు

ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

( హైదరాబాద్, న్యూస్ఇన్)

రాష్ట్రంలోని ఇంజ‌నీరింగ్ కళాశాల‌లు  ఫీజుల వ‌సూలుకు కొత్త ఎత్తులు వేస్తున్నాయి.  ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన ఫీజు  రీఎంబ‌ర్స్ మెంట్ బ‌కాయిలు పెండింగ్ లో ఉండ‌డంతో....క‌ళాశాల‌లు ఫీజుల కోసం విద్యార్థుల‌పై వ‌త్తిడి పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి.ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల‌కు వంద‌లాది కోట్ల రుపాయ‌లు ప్ర‌భుత్వం నుంచి బకాయిలు పెండింగ్లో ఉన్నాయి.నెల రోజుల క్రితం ఫీజులు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ క‌ళాశాల‌ల‌ను మూసి వేస్తామ‌ని హెచ్చ‌రించాయి. ఆ త‌రువాత స‌చివాల‌యం ముట్ట‌డికి పిలుపు నిచ్చాయి.డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఆధ్వ‌ర్యంలో ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల యాజమ‌న్యాల‌తో  ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్చ‌లు జ‌రిపింది. కళాశాలల మూసి వేత‌నిర్ణ‌యాన్ని వెంట‌నే ఉప‌సంహ‌రింప చేసింది. ఈ సంద‌ర్భంగా ద‌శ‌ల వారిగా పెండింగ్ బ‌కాయిలు చెల్లిస్తామ‌ని ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల‌కు వార్నింగ్ ఇవ్వ‌డంతో  క‌ళాశాల‌లు దిగి వ‌చ్చాయి. త‌మ  ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌ను  విర‌మించుకుంటామ‌ని ప్ర‌క‌టించి క‌ళాశాల‌లు య‌ధావిధిగా న‌డిపిస్తామ‌ని ప్ర‌క‌టించాయి.ఇక స‌మ‌స్య స‌ద్దుముణిగింద‌ని ప్ర‌భుత్వం భావించింది.కానీ   క‌ళాశాల‌ల‌కు వెళుతున్న విద్యార్థులపై ఫీజుల కోసం ఇంజ‌నీరింగ్ క‌ళాశాల యాజ‌మాన్యాలు ముందస్తు గా చెక్కు ఆస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి.

ఈ త‌తంగం జ‌రిగి నెల రోజులు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం నుంచి బ‌కాయిలకు సంబంధించి ఎలాంటి పురోగ‌తి లేదు… ప్ర‌భుత్వంపై పోరాటానికి సిద్ధమైన ప్రైవేటు క‌ళాశాలల యాజ‌మాన్య‌లు ఇప్పుడు విద్యార్థుల‌పై వ‌త్తిడి తెచ్చి ఫీజుల వ‌సూలుకు ముందస్తు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి. గ‌త ఏడాది కి సంబంధించి ఫీజుల బ‌కాయిలు కూడా ప్ర‌భుత్వం చెల్లించ‌క‌పోవ‌డంతో ప్ర‌తి విద్యార్థి నుంచి బ‌కాయి ఉన్నవిద్యా సంవ్స‌రాల‌కుసంబందించి చెక్కులు తేవాల‌ని ప్రైవేటు క‌ళాశాలు విద్యార్థుల‌పై వ‌త్తిడి పెంచుతున్నాయి. విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి ఫీజులు వ‌సూలు చేసుకునేందుకు బ్లాంక్ చెక్కులు ఇవ్వాల‌ని విద్యార్థుల‌కు క‌ళాశాల‌లు తేల్చి చెబుతున్నాయి.

ఇంజ‌నీరింగ్ రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థి అయితే…… గ‌త ఏడాది ఫీజు అంటూ ఒక‌చెక్కును, ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి మ‌రో చెక్కు ఇలా రెండు చెక్కులు త‌ల్లిదండ్రుల‌తో తేవాల‌ని ఇంజరీంగ్ రెండో ఏడాది వుతున్న విద్యార్థినిల‌ను అడుతున్న‌ట్లు “న్యూస్ ఇన్” దృష్టికి విద్యార్థుల త‌ల్లి దండ్రులు తెచ్చారు. న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న పేరొందిన ఒక క‌ళాశాల చెక్కులు తేవాల‌ని విద్యార్థుల‌పై వ‌త్తిడి తెస్తోంది. రెండు వారాల్లో చెక్కులు ఇవ్వాల‌ని గ‌డువు కూడా క‌ళాశాల‌లు విధిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కళాశాల‌లు ఇదే అద‌నుగా విద్యార్థుల త‌ల్లి దండ్రుల‌తో బ్లాంక్ చెక్కులు వ‌సూలుచేయాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. క‌ళాశాలల యాజ‌మ‌న్యం తీరుపై విద్యార్థుల త‌ల్లి దండ్రులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. విద్యార్థుల‌ను క‌ళాశాలల్లో చేర్పించుకునే స‌మ‌యంలో ఎలాంటి నిబంధన‌లు పాటించ‌కుండా చేర్చుకుంటూ…… బ‌కాయిల వసూలుకు కు

బ్లాంక్ చెక్కులు అడ‌గ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. విద్యార్థులపై వ‌త్తిడి పెంచితే ఆ ప్ర‌భావం వారి విద్యా సంవ‌త్స‌రం పై ప‌డే అవ‌కాశం ఉంద‌ని త‌ల్లి దండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ప్రభుత్వం నుంచి సంబంధిత కళాశాలలకు అందకపోవడంతో ఆ కళాశాలలో విద్యార్థులకు కోర్సు పూర్తయిన సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించాయి. అత్యవసరం అనుకున్న వారు మాత్రం కొంతమంది ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోతే బ్లాంక్ చెక్కులు తీసుకుంటున్న ఇంజనీరింగ్ కళాశాలలో ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తాయో అన్న ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *