NewsInn

News in a Click

హైద‌రాబాద్ లో మెస్సీ మ్యాచ్

హైద‌రాబాద్ లో మెస్సీ మ్యాచ్

హాజ‌రు కానున్న రాహూల్

భారీ బందోబ‌స్తు ఏర్పాటు

(హైద‌రాబాద్, న్యూస్ఇన్)

కాంగ్రెస్ ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్ర‌జాపాల‌న వారోత్సాలు, తెలంగాణా రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ఉత్స‌వాలు ముగియ‌నున్నాయి.ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వం ప్ర‌ముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోన‌ల్ మెస్సీతో కొద్ది సేపు ఫుట్ బాల్ అడే విధంగా షెడ్యూల్ ఫిక్స్ చేసింది. ప్రైవేటు టూర్ లో భాగంగా భార‌త దేశంలో ప‌ర్య‌టిస్తున్న‌మెస్సీ శ‌నివారం ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగే ఫుట్ బాల్ మ్యాచ్ లో కొద్ది సేపు పాల్గొననున్నారు. ఈ మ్యాచ్ లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనేందుకు గ‌త కొన్ని రోజులుగా వ‌రుస‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. మెస్సీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మ్యాచ్ లో మెస్సీ 5 నుంచి 10నిమిషాలు గ్రైండ్ లో సంద‌డి చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మెస్సీ త‌న జెర్సీ నం.10 తో య‌ధావిధిగా గ్రౌండ్ లోకి దిగుతుండ‌గా….

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న ల‌క్కీ నంబ‌ర్ గా భావించే 9వ నం. జెర్సీతో ఫుట్ బాల్ ఆడేందుకు బ‌రిలో దిగ‌నున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఎం సీహెచ్ ఆర్డీ లో సీఎం ప్రాక్టీస్ చేశారు. సీఏం వేసుకునే జెర్సీ అంటూ కాంగ్రెస్ నేత‌లు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున‌ ఫోటోలు షేర్ చేశారు.

గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు హాజ‌రు కాలేక‌పోయిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత శ‌నివారం నాటి మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ వీక్షించేందుకు హాజ‌రు కానున్నారు. సాయంత్రం హైద‌రాబాద్ చేరుకోనున్న రాహూల్ మెస్సీ బ‌స చేసే ఫ‌ల‌క్ న‌మా ప్యాలెస్ కు వెళతారు. 7 గంట‌ల ప్రాంతంలో ఉప్ప‌ల్ స్టేడియం చేరుకుంటారు. మ్యాచ్ అనంత‌రం రాత్రి కి ఢిల్లీ బ‌య‌లు దేరుతార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

మెస్సీ పర్య‌ట‌న ఖ‌ర్చుపై బీజెపి ఇప్ప‌టికే కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర‌స‌న‌లు చేప‌ట్టింది. ప్ర‌భుత్వం దీనిపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోంది. ఇది పూర్తిగా ప్రైవేటు గా ఏర్పాటు చేస్తున్న కార్య‌క్రమం అని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో మెస్సీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న మ‌రింత ఆస‌క్తి రేపుతోంది. మెస్సీ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు టికెట్ల అమ్మ‌కాలు దాదాపు 10రోజుల క్రిత‌మే మొద‌లయ్యాయి. అయితే మెస్సీతో ఫోటో దిగేందుకు కూడా నిర్వ‌హ‌కులు రేట్ ఫిక్స్ చేశారు. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో వంద మందికి మాత్రమే ఫోటో దిగేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందుకోసం ఇండియ‌న్ క‌రెన్సీలో 9.5 ల‌క్ష‌ల రుపాయ‌ల‌తో పాటు జీఎస్టీ అద‌నంగా చెల్లించాల‌ని నిర్వ‌హకులు ధ‌ర ఖ‌రారు చేశారు.

ప్ర‌భుత్వ రంగ సంస్థ సింగ‌రేణి సంస్థ‌ స్పాన్స‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నా…రాష్ట్ర ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో స‌హ‌క‌రిస్తున్నా ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హాకులు మంత్రుల‌ను కూడా బేఖాత‌ర్ చేస్తున్నార‌ని స‌చివాల‌యంలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సీఎంఓ క‌నుస‌న్న‌ల్లో ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుండ‌డంతో మంత్రులు కూడా సైలెంట్ గా ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ముఖ్య‌మంత్రి అనుచ‌రుల్లో కీల‌కంగా ఉన్న ఓ నేత‌నే ఈ వ్య‌వ‌హార‌ల‌న్నీ చ‌క్క‌బెడుతున్నార‌ని స‌చివాల‌య వ‌ర్గాల్లో చ‌ర్చ జరుగుతోంది. ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఇలాంటి కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు మంత్రుల‌పై వారి అనుచ‌రులు పాస్ ల కోసం వ‌త్తిడి తెస్తున్నా చేసేదేమి లేక అనుచ‌రులకే మంత్రులు న‌చ్చ చెబుతున్న‌ట్లు స‌మ‌చారం.

మెస్సీ మ్యాచ్ కు పోలీసుల సూచ‌న‌లు బందోబ‌స్తు….

కేవలం టికెట్లు ఉన్న వారికి మాత్రమే అనుమ‌తి

మెస్సీ కి Z కేటగిరీ భద్రత ఏర్పాటు చేస్తున్నాం

గ్రీన్ చానల్ ద్వారా తీసుకొస్తాం

వెహికిల్ లో ఉన్నప్పుడు కూడా చూసే అవకాశం ఉండదు

అనవసరంగా రోడ్డు మీదకి వచ్చి చూసే ప్రయత్నం చేయకండి

స్టేడియం పరిసరాల్లో 450 cc కెమెరాలు ఏర్పాటు చేశాం…

ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తాం..

కొద్దిసేపు మాత్రమే మెస్సీ ఆడతారు

ప్రేక్షకులు ముందస్తుగానే స్టేడియం చేరుకోవాలి

మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్ లతో నిఘా పెడుతున్నాం

ల్యాప్ టాప్, బ్యానర్లు, వాటర్ బాటిల్స్, కెమెరాలు, సిగరెట్స్, గొడుగులు,
లైటర్లు, బైనాకులర్స్, బ్యాటరీలు, షార్ప్ ఆబ్జెక్ట్స్, హెల్మెట్, బ్యాగ్ వంటివి స్టేడియం లోపలికి అనుమతి లేదు..

కేవలం మొబైల్ ఫోన్స్ మాత్రం అనుమతి

4 గంటల నుంచి ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తాం

రేపు సాయంత్రం 7 గంటలకు మ్యాచ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *