NewsInn

News in a Click

సీఎం రేవంత్ రెడ్డి తో మాజీ సీఎం అఖిలేష్ భేటీ

తాజా రాజకీయ పరిస్థితుల పైన చర్చ

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌)

హైద‌రాబాద్ కు వ‌చ్చిన యూపీ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గ‌నేందుకు వ‌చ్చిన ఆయ‌న అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను క‌లుసుకున్నారు. యాద‌వ సంఘం కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు హైద‌రాబాద్ కు ఆయ‌న చేరుకున్నారు. సీఎంతో భేటీ సంద‌ర్భంగా రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను సీఏం వివ‌రించారు.

AKHILESH YADAV MEET CM REVANTH REDDY

సమావేశం లో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్,మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్,రామగుండం ఎంఎల్ ఏ రాజ్ ఠాకూర్,కాంగ్రెస్ సీనియర్ నేత రోహిన్ రెడ్డి త‌దిత‌రులున్నారు. ఈ సంద‌ర్భంగా అఖిలేష్ యాద‌వ్ స్పందిస్తూ… ప్ర‌భుత్వ ప‌రంగా యాద‌వ్ ల‌కు ఎంతో ఇష్ట‌మైన స‌ద‌ర్ పండుగ‌ను రాష్ట్ర పండుగ‌గా గుర్తిస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడాన్ని అఖిలేష్ యాదవ్ ప్రశంసించారు. దేశం లోని యాదవ సమాజం రేవంత్ రెడ్డి ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. యాదవుల హృదయం లో రేవంత్ రెడ్డి ఉండిపోతారని అఖిలేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.తెలంగాణ లో ని యాదవ వర్గానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి కి అఖిలేష్ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *