NewsInn

News in a Click

త్వ‌ర‌లో తెలంగాణా ప్ర‌జా జాగృతి పార్టీ

త్వ‌ర‌లో తెలంగాణా ప్ర‌జా జాగృతి పార్టీ

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

త్వ‌ర‌లో రాజ‌కీయ పార్టీని ప్రారంభిస్తాన‌ని ప్ర‌క‌టించిన మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత త‌న పార్టీ పేరు తెలంగాణా ప్ర‌జా జాగృతి అనే పేరును క‌విత ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. రెండు,మూడు నెల‌ల్లో పార్టీ ప్ర‌క‌టిస్తానని క‌విత ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో క‌విత పార్టీకి ముహూర్తం ఎప్పుడ‌న్న‌ది రాజ‌కీయంగా అంద‌రిలోనూ ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది. తెలంగాణా ప్ర‌జా పార్టీని ఏర్పాటు చేసి మ‌రిన్న ప్ర‌జా ఉద్య‌మాల‌కు శ్రీకారం చుట్టాల‌ని క‌విత భావిస్తున్నారు. తెలంగాణా ప్ర‌జా పార్టీకి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న పై ఉత్కంఠ నెల‌కొంది. ఇందుకు సంబంధించి కీల‌క విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. జ‌న‌వ‌రి 23వ తేదీన తెలంగాణా ప్ర‌జా పార్టీగా పేరు ను ఖ‌రారు చేస్తూ పార్టీ ని న‌మోదు చేయాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

కానీ ఇక్క‌డ జాప్యం జ‌రుగుతుండ‌డంతో….. ఈ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ఈసీని ఆదేశించాల‌ని క‌విత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ కేసును విచారించిన కోర్టు త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఈసీకి సూచించింది. దీంతో క‌విత కొత్త పార్టీపై త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క్రియ పూర్తి కానుంది.

జాగృతి కార్యాల‌యంలో ఉగాది వేడుకులు…

త్వ‌ర‌లో రాజ‌కీయ పార్టీగా ఆవిర్భ‌వించ‌నున్న తెలంగాణా జాగృతి కొత్త సంస్కృతికి తెర‌లేపింది. కొత్త సంవ‌త్సరం ఉగాది నుంచి ప్ర‌తి ఉగాదికి రాష్ట్ర బ‌డ్జెట్ మాదిరిగానే ప్ర‌జా బ‌డ్జెట్ పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణా జాగృతి అధ్య‌క్షురాలు క‌విత ఆధ్వ‌ర్యంలో జాగృతి కార్యాల‌యంలో ఉగాది వేడుకులు నిర్వ‌హించారు. అనంత‌రం ప్ర‌జా బ‌డ్జెట్ ను తెలంగాణా జాగృతి ప్ర‌వేశ పెట్టింది. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు బ‌డ్జెట్ లో ప్ర‌తిపాద‌నాలుంటాయ‌ని క‌విత వెల్ల‌డించారు.

తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్…..

  • విద్యారంగానికి రూ.30 వేల కోట్లు
  • వైద్య, ఆరోగ్య శాఖకు రూ.25 వేల కోట్లు
  • యూనివర్సిటీ విద్యకు రూ.2 వేల కోట్లు
  • వృద్ధులు, వికలాంగులు సహా ఇతర పింఛన్లకు రూ.25 వేల కోట్లు
  • ఇందిరమ్మ ఇళ్లకు రూ.20 వేల కోట్లు
  • తెలంగాణ ఉద్యమకారులకు ఇండ్లు, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లకు రూ.5 వేల కోట్లు
  • ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందజేయడానికి రూ.100 కోట్లు
  • 18 ఏళ్లు నిండిన యువతులకు స్కూటీల పంపిణీకి రూ.5 వేల కోట్లు
  • రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వడంతో రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం అందించడానికి రూ.35 వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం.
  • 16 లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం సాయం చేయడానికి రూ.5 వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం
  • బీసీల సంక్షేమానికి రూ.20 వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం
  • ఎస్సీ ల సంక్షేమానికి రూ.18 వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం
  • ఎస్టీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం
  • మైనారిటీల సంక్షేమానికి రూ.5 వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం
  • కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ సాయంతో పాటు తులం బంగారం ఇవ్వడానికి రూ.10 వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం
  • ఎంఎస్ఎంఈలు, పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాల కోసం రూ.10 కోట్లు ప్రతిపాదిస్తున్నాం
  • 50 ఏళ్లు నిండిన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 పింఛన్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం రూ.5,500 కలిపి ఇస్తుంది.. దీనిని సద్వినియోగం చేసుకొని లక్ష మంది కళాకారులకు పింఛన్ ఇవ్వడానికి రూ.100 కోట్లు కేటాయించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *