(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాంగ్రెస్ పార్టీలో దాదాపు 40 ఏళ్లుగా రాజకీయ జీవితాన్ని గడిపిన టీ. జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమైంది. ఆయన మీడియాతో చేసిన వ్యాఖ్యలతో పార్టీ వీడడంపై క్లారిటీ వచ్చింది. 25వ తేదీన పార్టీకి రాజీనామా చేశాను అని ప్రకటించడంతో ఇక భవిష్యత్తు రాజకీయం ఏ పార్టీలో అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. శనివారం రోజు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ లు జీవన్ రెడ్డి ని కలిసి కాంగ్రెస్ లో కొనసాగాలని కోరినా ఫలితం దక్కలేదు. మంత్రుల బుజ్జగింపులకు సీనియర్ నేత ఎక్కడ అంగీకరించలేదు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరిస్తూ నియోజకవర్గంలో తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను మంత్రులకు వివరించినట్లు సమాచారం. దీంతో మంత్రులు కూడా తమ పరిధిలోని అంశాలను సీనియర్ నేత ప్రస్తావించడంతో ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే వెనుదిరిగారు. మంత్రులు వెళ్లిన వెంటనే మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి దేవుడు శాసిస్తాడు…మానవుడు ఆనుసరిస్తాడని వ్యాఖ్యలు చేశారు. దీంతోనే జీవన్ రెడ్డి పార్టీ వీడడం ఖాయమైందని తేలిపోయింది.

తాజాగా ఈ రోజు మీడియాతో మాట్లాడిన అవమానాలను భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు ఈ నెల 25వ తేదీన జగిత్యాలలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఆ పమావేశానికి తన అనుచరులు వచ్చి సలహాలు ఇవ్వవచ్చని కోరారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటిస్తూ…భవిష్యత్తు లో ఏ పార్టీ నుంచి రాజకీయం చేయాలన్న దానిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే బీఆర్ ఎస్ తో జీవన్ రెడ్డి చేరిక పై చర్చలు పూర్తయ్యాయని ప్రచారం జరుగుతోంది.అందుకు అనుగుణంగా బీఆర్ ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కూడా సానుకూలంగా స్పందించారు. జీవన్ రెడ్డి బీఆర్ ఎస్ లో చయేరుతానంటే తాను పార్టీ అధినేత కేసిఆర్ దగ్గరకు తన భుజాలపై తీసుకెళుతానని ప్రటకించారు. ఇక జీవన్ రెడ్డి కారెక్కడం లాంఛనంగానే చెప్పుకోవచ్చు.
మంత్రుల బుజ్జగింపులు విఫలం…….










Leave a Reply