
(హైదరాబాద్,న్యూస్ఇన్)
నెట్ వర్క్ మార్కెటింగ్ తో మూడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న క్యూనెట్ కార్యాలయాపై సీసీఎస్ పోలీసులు ఏక కాలంలో దాడులు జరిపారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో సోదాలు నిర్వహిస్తున్నారు. క్యూనెట్ కార్యాలయాలున్న హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ తెల్ల వారు జామునుందే పోలీసులు ఏకకాలంలో సోదాలు చేయడం కలకలం రేపింది. మూడు రాష్ట్రాల్లోని 25 ప్రాంతాల్లో పోలీసులు ఒకే సారి రైడ్ చేశారు. హైదరాబాద్ లోనే ఆరు చోట్ల పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో వందలకోట్ల రుపాయాలు క్యూనెట్ వసూలు చేసిందనే ఆరోపణలున్నాయి. గతంలోనే క్యూ నెట్ బాధితులు ఎంతో మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మరో రెండు కేసులు నమోదు కావడంతో పోలీసులు ఈ సంస్థ కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. ఈ కేసుతో సంబందం ఉన్న 20 మందిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.








Leave a Reply