
-కేటీఆర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
బీఆర్ ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్ రేస్ వివాదంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో గత కొన్ని రోజులుగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. కేసులో కీలకమైన చార్జ్ షీట్ ను పోలీసులు దాఖలు చేయడంతో మరోసారి తెరపైకి కార్ రేస్ వ్యవహారం వచ్చింది. కేసులో ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. చార్జ్ షీట్ దాఖలు చేయడంంతో కేసు పై ప్రభుత్వం మరోసారి ఫోకస్ చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా విషయాలపై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ స్పందించారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మట్లాడుతూ…ఈ కేసులో ఏమి లేదని ప్రభుత్వానికి తెలుసని వ్యాఖ్యానించారు. తాము చెల్లించిన 45 కోట్ల రుపాయాలు తీసుకున్న వారు స్వీకరించామని చెబుతుంటే ప్రభుత్వం ఇంకా ఇది స్కాం అనడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణా ప్రభుత్వం నుంచి నిధులు తమకు అందాయని ఆ సంస్థ చెబుతోందని బీఆర్ఎస్ ప్రభుత్వం 45 కోట్లు ఇస్తే…. కాంగ్రెస్ ప్రభుత్వం 600, 700 కోట్ల రుపాయాలని తప్పుదోవ పట్టిస్తోందని కేటిఆర్ అన్నారు. ఈ కేసులో ఎవరికి లబ్ది జరిగిందనే విషయం చార్జ్ షీట్లో లేదని కేటిఆర్ చెప్పారు. ఈ కార్ రేస్ తో తాము రాష్ట్రానికి దాదాపు 700 కోట్ల రుపాయాలు పెట్టబడులు తెస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీల నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో అప్రదిష్ట పాలైందని ఆరోపించారు. అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన యూకే యువతి లైగింక వేధిపులు జరిగాయని ఆరోపిస్తే…కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఎవరిపైనా కేసు కూడా నమోదు చేయలేదన్నారు. నా పై ఉన్నరాజకీయ కక్షతో అధికారులపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదన్నారు.తమకు న్యాయ స్థానాలపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని న్యాయం జరగుతుందని కేటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.



Leave a Reply