NewsInn

News in a Click

పెర‌గ‌నున్న ఉష్ణోగ్ర‌త‌లు – సాయంత్రం వ‌ర్షాలు…!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

నిన్న మొన్న‌టి వ‌ర‌కు వేస‌విలో చ‌ల్ల‌ద‌నంతో ఆహ్లాదంగా ఉన్న ప్ర‌జ‌ల‌కు ఈ రోజు నుంచి భిన్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను ఒకే రోజు చూడాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం వ‌ర‌కు భార‌గా ఊష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 39 నుంచి 41 డిగ్రీల వ‌ర‌కు న‌మోదుయ్యే అవ‌కాశం ఉంది. హైద‌రాబాద్ లో 39 డిగ్రీల ఊష్ణోగ్ర‌తలు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో అక్క‌డ‌క్క‌డా చెదురుముదురు వ‌ర్షాలు సాయంత్రం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ నివేదిక అందించింది.

అధిక వేడి కారణంగా, సాయంత్రం నుండి రాత్రి వరకు వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నారాయణపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లలో కూడా చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్ – సాయంత్రం వేళల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది, మిగిలిన సమయంలో వాతావరణం పొడిగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *