NewsInn

News in a Click

సీఎస్సార్ నిదుల వినియోగానికి కొత్త పాల‌సీ

సీఎం రేవంత్ రెడ్డి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో కార్పోరేట‌ర్ సోష‌ల్ రెస్పాన్స్ లో భాగంగా తెలంగాణాలో వీలైన‌న్ని నిదులు స‌మీక‌రించేందుకు అనుగుణంగా కొత్త పాల‌సీని రూపొందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ఈ నిధుల వినియోగం కేవ‌లం 3 శాతం మాత్ర‌మే ఉండ‌డం శోచ‌నీయంగా ఉంద‌న్నారు. ఇక్క‌డ వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఇత‌ర చోట్ల ఖ‌ర్చు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని సీఎం వ్యాఖ్యానించారు. స్తానికంగా వ్యాపాల‌రు నిర్వ‌హించే క‌నీసం 50 శాతం ఇక్క‌డే నిధుల‌ను ఖ‌ర్చు చేసేలా నిబంధ‌న‌లు అమ‌లు చేసేలా కొత్త విధి విధినాల‌ను ఖ‌రారు చేయాల‌న్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో ఈ నిధుల వినియోగంపై అధ్య‌య‌నం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధుల విరాళాలతో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం తరఫున అభినందించాలని సూచించారు. ప్రతి ఏడాది అత్యుత్తమ భాగస్వామ్యం పంచుకున్న సంస్థల ప్రతినిధులను అభినందించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పారు.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ అభినందన ఉత్సవానికి ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ తో చేపడుతున్న కార్యక్రమాల వివరాలు, అన్ని ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, సీఎస్ఆర్ ద్వారా చేపట్టేందుకు వీలున్న కార్యక్రమాల వివరాలన్నీ సమన్వయం చేసే బాధ్యతలను రాష్ట్రస్థాయి సెల్ నిర్వర్తిస్తుందన్నారు. ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేకంగా తెలంగాణ సీఎస్ఆర్ పోర్టల్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ విరాళాలను ఇచ్చేందుకు, వివిధ విభాగాల పరిధిలో చేపట్టేందుకు వీలున్న ప్రాజెక్టుల వివరాలన్నీ పోర్టల్ లో పొందుపరచాలన్నారు. కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు, తమకు అనువైన ప్రాజెక్టులను ఎంచుకునేందుకు వీలుగా ఈ పోర్టల్ ఆకర్షణీయంగా తయారు చేయాలని చెప్పారు.

చిన్నారుల పౌష్టికాహారం పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *