(హైదరాబాద్, న్యూస్ఇన్)
తమ గ్రామ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆ గ్రామ ప్రజలు సర్పంచ్ ఎన్నికలను అస్త్రంగా వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపల్లిలో పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు ప్రకటించారు. గ్రామ సమస్యలను పరిష్కరించాలని ఎన్నో ఏళ్లుగా తాము కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

తమ గ్రామానికి రాకపోకల సాగించేందుకు కూడా ఎదురవుతున్న సమస్యలను గ్రామస్తులు ప్రస్తావిస్తున్నారు. జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతలోనే ఈ గ్రామానికి ఎన్నికలు జరుగాల్సి ఉండగా ఒక్కరు కూడా నామినేషన్ వేయరాదని గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. అయితే అధికారులు గ్రామానికి చేరుకుని గ్రామస్తులను ఒప్పించే యత్నం చేస్తున్నారు.





Leave a Reply