( హైదరాబాద్, న్యూస్ఇన్)
ప్రముఖ కథానాయిక సమంత కొత్త జీవితాన్ని ఆరంభించింది. ఫ్యామిలీ మెన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి కొత్త వివాహబంధంలో అడుగు పెట్టింది. సోమవారం ఈషా ఫౌండేషన్ లో ఉన్న లింగభైరవి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీరి పెళ్లి విషయం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. వీరి పెళ్లిపై ఈషా ఫౌండేషన్ విడుదల చేసిన ప్రకటనలో సంభూత శుద్ధి వివాహం చేసుకున్నారని తెలిపింది. దీంతో ఈ వివాహ పద్ధతిపై నెటిజన్లు పెద్ద ఎత్తున ఆరా తీయడం మొదలు పెట్టారు.

సంభూత శుద్ధి వివాహం అంటే……
హిందూ సాంప్రదాయంలో పురాతన ఆచారం….ఇది సాంప్రదాయ బద్దంగా జరిగే ప్రక్రియ వివాహానికి ముందు శుధ్ది కార్యక్రమాలు నిర్వహించడం ఈ వివాహం ప్రత్యేకత.శుద్ధ చేసేందుకు మంత్రి పఠనం, పవిత్రీకరణం వంటి అంశాలను ఇందులో ముందుగా పాటిస్తారు. వధువు, వరుడు ఈ ప్రక్రియ ద్వారా శుద్ధి పొందుతారని నమ్మకం.

ఈ పద్ధతిని వేద మంత్రోఛ్చారణల మధ్య జరపడం అనవాయితీ. దంపతల మధ్య శాశ్విత బంధం, ఆధ్యాత్మిక శ్రేయస్సు వంటి అంశాలు ఈ విధానంలో కలిసి వస్తాయని పండితులు అంటారు. భారతీయ వివాహా బంధాల్లో అనవాయితీగా ఈ పాటించే శుద్ధి చర్యలనే సంభూత శుద్దిగా పిలుస్తుంటారు.


Leave a Reply