NewsInn

News in a Click

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపు

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్)

ఈ సంవత్సరం (2026) నుండి 2.1% DA ను పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్ల‌డించారు.ఇంతకు ముందు 50.7% DA ఉండగా, ఇపుడు దాన్ని 52.8% కి చేరుకోనుంది.పెరిగిన DA జనవరి 1, 2026 నుండి అమలు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా బ‌కాయిల‌ను చెల్లించాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది.పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీ పై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం ప‌డ‌నుంది. జూలై 2025 లో కూడా 2.1% DA పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. జూలై 2025 లో 48.6% నుండి 50.7% నికి పెంపఆర్టీసీ ఉద్యోగులకు డీఏ ప్రకటించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ను అభినందించిన ఆర్టీసీ ఎండీ ఉన్న‌తాధికారులు. ఆర్టీసీ లో పెండింగ్ పనులు అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్ లో ఆర్ ఎం లతో మంత్రి పొన్నం ప్రభాకర్ స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వహించారు.పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *