
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రముఖ సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. తన దగ్గర 10 కోట్ల రుపాయాలు తీసుకుని మోసం చేసిందని సుబ్బారావ్ అనే న్యాయవాది ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని మంగ్లీని అడిగితే శవం కూడా దొరకకకుండా చేస్తానని మంగ్లీ బెదిరించిందని, ఆరోపించారు. ఇదే విధంగా దాదాపు 150 మంది ని మంగ్లీ మోసం చేశారని ఈ కుట్రలో డైరె్టర్ ఉడుగుల వేణు, మంగ్లీ సొదరుడు భాగ స్వాములుగా ఉన్నారని న్యాయ వాది ఆరోపించారు. మంగ్లీ బెదిరింపులతో
తనకు ప్రాణ హాని ఉందని బాధితుడు ఫిర్యాదు చేయడంతో, BNS 351(2), 352 సెక్షన్ల ప్రకారం మంగ్లీ, వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.








Leave a Reply