(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఫ్యూచర్ సిటీని అద్భుతమైన నగరంగా నిర్మాణం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తామన్నారు. అమెజాన్ డెటా సెంటర్ కు ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే “తెలంగాణ రైజింగ్-2047” లక్ష్యం. వికసిత భారత్ 2047 లక్ష్యం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ గా భారత్ ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా జాతీయ జీడీపీలో తెలంగాణ తన వాటాను ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టుబడులు, ఉద్యోగ కల్పన కీలకం.. ఇందులో భాగంగా, పరిశ్రమల కల్పనకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు, అనుమతులను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం అన్నారు. అమెజాన్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఆ ప్రాంతాల్లో ఇతర కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుకు దోహద పడుతుందన్నారు.మూడు లక్షల ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులు గా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.. నగరంలో డీజిల్ మీద ఆధార పడి నడుస్తున్న 2 లక్షల ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే దిశగా చర్యలు చేపట్టినట్లు సీఎం వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ కు టాక్స్ ను పూర్తిగా మినహాయించి హైదరాబాద్ ను కాలుష్య రహితంగా మార్చడంపై దృష్టి సారించామన్నారు.అమెజాన్ సంస్థ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని కోరారు.

రైతులను గౌరవించాల్సిన బాధ్యత మాదే..
అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆందోళనలు చేపడుతున్న రైతులతో చర్చించాలని మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే కె లక్ష్మా రెడ్డి గార్లకు సూచిస్తున్నా.. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించాలి.. మంచి నష్ట పరిహారాన్ని అందించాలని సూచించారు.
కోవిడ్ తరువాత భారీగా మార్పులు…..

కోవిడ్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా భారీ గా మార్పులు వస్తున్నాయని సీఎం అన్నారు. పాలమూరు జిల్లాలోని అమరరాజా కంపెనీని సీఎం సందర్శించారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులతో వర్షాలు సరిగ్గా కురవడం లేదన్నారు. కాలుష్యం తగ్గించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇవీ వాహనాలకు ప్రోత్సహం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047 లో భాగంగా పాలసీలు తీసుకువస్తున్నామని సీఎం చెప్పారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం దృష్టి సారించాలని సీఎం అమర రాజా కంపెనీకి సూచించారు.
త్వరలో శుభవార్త……
పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటి కేటాయింపులు జరిపే విధంఆ చర్యలు చర్యలు జరుతున్నట్లు సీఎం వెల్లడించారు. డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీలు కేటాయించే అంశంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తి, బీమా, ఆర్డీఎస్, నెట్టంపాడు వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాంమని సీఎం చెప్పారు.












Leave a Reply